చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, May 19, 2009

పోరుబందర్


భారతీయులకు కాశీ,తిరుపతి లాగే పొరుబందర్ కూడా పుణ్యస్తలము.అహింసా వాదము తో రవి అస్తమించని బ్రిటిష్ వారిని గడగడలాడించిన అసింసావాది గాంధి మహాత్ముడు జన్మించిన పుణ్యప్రదేశము.తన జీవన శైలి తో అందరూ ఎంత నిరాడంబరము గా వుండాలో,చెడు వినవద్దు,చెడుచూడవద్దు,చెడు మాట్లాడవద్దు అని అందరికి భోదించిన మహనీయుని జన్మ స్తానము. భారతీయులందరు కనీసము వక్కసారైనా దర్షించవలసిన ప్రదేశము పోరుబందర్.ఆ మహనీయుని గృహములోనికి వెళుతుంటే నే చెప్పలేని భావన కలిగింది.ఒక దేవాలయములోనికి వెళుతున్నట్లుగానే భావించి మహాత్ముని మన్సులోనే స్మరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షముగా చూడలేకపొయినందుకు చాలా బాధ కలిగింది. లోనికి వెళుతుండగా నా చిన్నప్పుడు స్కూల్ లో పాడిన పాట "భలే తాత మన బాపూజీ ,బాలల తాతా బాపూజీ" పాట గుర్తుకువచ్చింది.గాంధీజీ ఇల్లు చాలా పెద్దగా వుంది.చిన్న చిన్న గదులు ,వాటికి చిన్న చిన్న కిటికీలు మొత్తము ఇల్లు చూడటానికి చాలా సమయము పట్టింది.ఆయన ఇంటికి ఎదురుగానే కస్తూరీబా ఇల్లు వుంది.ఈ పక్కన వున్నది గాంధీజీ ఇల్లు.వెనుకగా చిన్న చిన్న నల్ల కిటికీ లు కనిపిస్తున్న ఇల్లు కస్తూరిబా పుట్టిల్లు.హరికథ లో పిట్టకథలా ,కస్త్తూరీబా గది,గాంధీజీ గది ఎదురెదుగా వుండేవని ,వారి గది కిటికీలనుండి చూసుకుంటూ ఇద్దరూ ప్రేమించుకుని వివాహమాడారని గైడ్ గాంధీజీ ప్రేమకథ చెపాడు.

పోరుబందర్ నుండి దండి వెళ్ళాము.అది ఒక చిన్న పల్లె.అక్కడ సముద్రము నుండి నీరు తీసి మడులలో ఎండపెట్టి ఉప్పును తయారు చేస్తారు.దాని ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.అక్కడి ప్రజలకు అదే జీవనాధారము.గాంధీజీ ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించింది ఇక్కడే.

పోరుబందర్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాము.కొద్ది దూరము వెళ్ళగానే మాధవపురం అని బొర్డ్ కనిపించింది.దానిని చూడగానే పిల్లలు డాడీ నీపేరు మీద వూరుంది అన్నారు .మా వారిని ఇంట్లో పెద్దవాళ్ళు మాధవా అని పిలుస్తారు.వెంటనే కార్ ఆపి ఇక్కడ ఎమిటి ప్రత్యేకము ఈపేరుంది అనిదారి లో ఒకరిని అడిగాము. ఇక్కడ శ్రీకృష్ణుడు నిర్యాణము చెందారని ఆ ప్రదేశము చూపారు.పక్కన కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు నది పక్కన , కూర్చొనివుండగా బోయవాడు ఆయన బొటనవేలిని పక్షి అని భ్రమపడి, భాణముతో కొట్టిన వృక్షమని స్తానికులు చెప్పారు.దానిని వాడి పోకుండా ఇన్ని సంవత్సరాలనుండీ ఇలా దడి కట్టి కాపాడుతున్నామని చెప్పారు. ఇంకా ఇక్కడ ఇలాటి ప్రత్యేకమైన వూరులు ఏమి వున్నాయి అని అడిగితే ఇంకొంచము ముందు సత్యభామ ,శ్రీకృష్ణుని తో నరకాసురుని మీదికి యుద్దానికి బయిలుదేరిన పల్లెని చూపారు.అక్కడ శ్రీకృష్ణుడు ,సత్యభామల దేవాలయము వుంది.అక్కడ చుట్టుపక్కల అన్ని పల్లెలూ ఎదోవిధముగా శ్రీకృష్ణుని గాధలతో ముడిపడి వున్నాయి.


ఆ పల్లెలన్నీ చూసుకుంటూ వెళుతుండగా మద్యాహ్నమైంది. భొజనము కోసము చూస్తే ఎక్కడా హొటల్స్ లేవు.మొతానికి ఒక ముసలామె సొజ్జరోటీ లు చేసిస్తుందని తెలిసి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాము.అప్పటికి ఆమె దగ్గరకూడా అయిపొయాయి పైగా పిల్లలు మేము సొజ్జరోటీలు తినము అని గొడవ.మావారెమో మా నాయనమ్మ మాకు చిన్నప్పుడు జొన్న రొట్టెలు ,జొన్న అన్నము పెట్టేది నేనెప్పుడు సొజ్జరొట్టెలు తిన్లేదు తిందాము అని మొత్తానికి పిల్లలే గెలిచారు .ఆవిడ గోధుమ పిండి కొనుక్కొని వచ్చి గోధుమ రొటీలు,బటాఖా (ఆలూ)సబ్జీ చేసి ఇచ్చింది.అవి తీసుకొని రోడ్ పక్కన కార్ ఆపి తినపొయేంతలో ,పక్కన వున్న పొలము లోనుంచి రైతు వచ్చి వాళ్ళ పొలములో తినమని ఆహ్వానించాడు.లోపల రావి చెట్టుకింద నులక మంచాలు వేసి,నాలుగు సొజ్జరొట్టెలు.పచ్చడీ, మంచినీరూ తెచ్చి ఇచ్చాడు. అందరమూ తిని, హాయిగా ఆ చల్ల గాలికి పడుకున్నాము.మేము బయిలుదేరెసరికి పెద్ద,పెద్ద బంగారంలా మెరుస్తున్న ఇత్తడి గ్లాసుల నిండా చాస్ పీవో అంటూ మజ్జిగ ఇచ్చాడు.డబ్బులివ్వబోతే తీసుకోలేదు.ఆ రొజు ఆ అవ్వ ఇచ్చిన రొట్టెలు, ఆ రైతు ఆథిద్యమూ మరువలేనివి.సౌరాస్ట్ట్రీయులు సహృదయులు అనుకున్నాము.


ఇది జునాగడ్ లోని ప్రసిద్ద మసీదు.పూర్తిగా మొగలాయుల తరహాలో కట్టారు.చక్కని లతలు పూలతో చెక్కారు.దీని వెనుకనుంచి జునాగడ్ కోటకి దారి వుంది.కోట ఎక్కే సరదా లేకపోయింది,అంతే కాక చీకటి కూడా పడుతుండటముతో ముందుకు సాగాము. కొంచము దూరము వెళ్ళగానే చిన్న సిటీ కనిపించింది.అక్కడినుంచి బరోడా నాలుగైదు గంటలుంటుందని తెలియటములో ఆ రాత్రి అక్కడే బస చేద్దామనుకున్నాము.



సరైన ప్రదేశము కొరకు వెతుకుతుండగా దగ్గరలో జలారాం సత్రముందని చెప్పారు.జలారాం అక్కడి
పేరుపొందిన సాధువు.ఆయన దేవాలయములోనే ఉచిత సత్రము భోజన వసతులతో వుంది.అందరమూ హొటల్ కి వెళుదామని గొడవచేసినా మా వారు వినకుండా అక్కడే బస చేయించారు. ఆ రాత్రి అక్కడే వుండి వుదయము జలారాముని దర్షనము చేసుకొని ముందుకు సాగాము.ఆ రాత్రి మాకు నీడనిచ్చిన జలారాముడు ఈయననే.అక్కడినుంచి బరోడా నాలుగైదు గంటలే అన్నారు కా ని ఆరోజంతా పట్టింది.మావారు చాలా ఆందోళనగా కనిపించటముతో ఎమిటి అని అడిగితే పెట్రోల్ అయిపోతోంది అన్నారు. ఐతే దారి లో పోయించండి అన్నా !ఆ తెలివి లేకే వూరుకున్నానా పైసలుకూడా అయిపోయాయి అన్నారు.సగము అహ్మదాబాద్ లో నీ షాపింగ్ కే అయిపొయాయి.అందుకే రాత్రి సత్రములోవుంది.అన్నారు.బాగుంది ,యాత్ర మొదట్లో గెస్ట్ హవుస్ లో చివర సత్రములో.పొనీయండి నా గాజులన్నాయి,చెవి రింగులున్నాయి అన్నాను.వుంటే ఈ అడివిలో ఈ రాత్రివేళ ఎవరు కొంటారు అంగానే ఎట్లా డాడీ అని పిల్లలు ఏడుపు మొహం పెట్టారు .ఎంచేద్దాం జయ్ జలారాం,జై జై జలారాం అని భజన చేయండి థౌసండ్ టైమెస్ కాగానే బరోడా వచ్చేస్తుంది అన్నారు .అంతే భజన మహిమో ఇంకొటో కాని రాత్రి పదకొండుగంటలకి ఇంటికి క్షేమం గా చేరాము.జై జల్లారాం జయ్ జయ్ జలారాం .

ఈ ప్రయాణము 1983 డిసెంబర్ మొదటివారము లో చేసాము.అందువలన అన్ని ప్రదేశముల పేరులు గుర్తులేవు.కార్ లో ప్రయాణిచటము వలన చిన్న చిన్న ప్రదేశాలు కూడా చూడగలిగాము.ఇన్ని సంవత్సరాలు జరిగినయి ,ఇప్పుడు ఆప్రదేశములు మారివుండవచ్చు లేదా చారిత్రాత్మకము అయినవి కాబట్టి మారకపొనూవచ్చు.


చల్తే చల్తే మేరి ఏ బాత్ యాద్ రఖనా కభి అల్విదా నా కహనా

Wednesday, May 13, 2009

సోమనాథ్ ,ద్వారక

డిన్నర్ తరువాత సుధీర్ ధాండేకర్ వెలుతూ క్యారే ప్రభాత్ మీరు కూడా రావచ్చుకదా పిల్లలకి సెలవలెగా అన్నారు.

ఆయన సరే ఎలా వెల్దాము అని అడిగారు.మీరొస్తానంటే మా హెరాల్డ్ లో వెల్దాం అని ప్రోగ్రాం వేసేసారు.అంతే మా సౌరాస్ట్రా ట్రిప్ ప్లాన్ అయిపోయింది.మా ట్రిప్స్ అన్ని అంతే.ముందుగా పలానా చోటుకి,పలానావిధంగా అంటూ ఎప్పుడూ ప్లాన్ చేయము.ఉషా ధాండేకర్ రానంది. మేమిద్దరము,మా పిల్లలు సంజు,బిపు,మా చెల్లెలు జయ పొద్దున్నే బయలుదేరటము ఖాయమైంది.మేమంతా చాలా ఎక్షైటింగా సామానులు సర్ద్దేసాము.పొద్దున ఎనిమిదింటికి సుధీర్ హెరాల్డ్ కార్ తీసుకొని వచ్చేసారు.
మా మొదటి మజిలి అహ్మదాబాద్.షబర్మతి నదీ తీరాన వున్న గాంధిజీ షబర్మతి ఆశ్రమానికి వెళ్ళాము.ప్రశాంతమైన వాతావరణము లో చిన్న చిన్న కుటీరములతో ఎంతో ప్రశాంతముగా వుంది.ఒక కుటేరము గాంధీజీ ది అని,అందులో గాంధీజీ ఉపయోగించిన వస్తువులను ప్రదర్షన కోసము వుంచారు.అక్కడ వున్నంత సేపూ ఒక పవిత్రమైన ప్రదేశం లోవున్న భావన కలిగింది.నాకైతే అక్కడే వుండి పోవాలనిపించింది. భొజనం తరువాత టెక్ష్టైల్స్ మిల్ల్స్ షాప్స్ కి వెళ్ళాము.అహ్మదాబాద్ టెక్ష్టైల్ మిల్ల్స్ కి ప్రసిద్ది.బట్టల చిన్న చిన్న ముక్కలు చాలా చవుకగా అమ్ముతారు.సంజుకు బోలెడు డ్రెస్స్ లు కుట్టవచ్చని సంతోషపడిపోయాను. మవారి ని పట్టించుకోకుండా ఎన్ని పీసెస్ కొన్నానో.రాత్రి ఓపెన్ కార్ థియేటర్ లో సినిమా చూసాము. కార్ లో కూర్చొని భేల్పూరి తింటూ సినిమా చూడటము పిల్లలు ఎంజాయ్ చేసారు.
మరునాడంతా ప్రయాణము చేసి మరునాడు సాయంకాలానికి పోరుబందర్ చేరుకున్నాము.సుధీర్ వాళ్ళ గెస్ట్ హవుజ్ లో బస ఏర్పాటు చేసారు. అక్కడ రెండు రోజులు వున్నాము

సోమనాథ్ దేవాలయము


ఒకరోజు జ్యోతిర్లింగాలలో ఒకటైన సొమనాథ్ దేవాలయాని కి వెళ్ళాము.ఆ రొజు అంతగా రద్దీ లేదు.కార్తీక మాసములో శివదర్షనము కలగటము మా పుణ్యము అనుకున్నాను.అదీ అనుకోకుండా జ్యోతిర్లింగ దర్షనము.అప్పుడే ఒక పక్కగా రిపేరులు చేస్తున్నారు.దేశము లోని అన్ని దేవాలయాల లాగే ఈ దేవాలయమూ ముష్కరుల దాడికి గురైంది.అలాంటివి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది.
అక్కడి నుంచే ద్వారక కి వెళ్ళవచ్చు.బోట్ లో ద్వారక కి బయిలుదేరాము.శ్రీ క్రిష్ణుని రాజధాని ద్వారకకు వెళుతున్నామనగానే యన్.టి.రామారావు గారి శ్రీక్రిష్ణ సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి.మనసంతా ఉద్వేగముతో నిండి పోయింది.ద్వారక దగ్గర పడుతుండగా మా వారు అదిగో ద్వారక ,ఆలమందలవిగో అంటూ పద్యమందుకున్నారు.పిల్లలు క్రిష్నుడి కథలు గుర్తు చేసుకున్నారు.జయ ఎదొ పాట చిన్నగా పాడుకుంటోంది. అందరి భావోద్వేగాల మద్య ద్వారక చేరాము.యాదవుల అంతము తరువాత ద్వారక సముద్రము లో మునిగిపోయింది.ఆ తరువాత ఆ ప్రదేశములో కొద్దిగా బయటకి వచ్చిన ద్వీపము లో కొత్తగా శ్రిక్రిష్ణుని ,సత్యభామ,రుక్మిణి ల భవనములను uఉహించి నమూనాలుగా కట్టారు.దీనిని బేట్ ద్వారక అంటారు.ఎంతో ఊహించుకొని వెళ్ళిన నాకు నిరుత్షాహముగా అనిపించింది.ఇది రుక్మిణి భవనము,ఇది సత్యభామ భవనము అంటూ రకరకాల రంగులు వేసిన చిన్న చిన్న ఇళ్ళు చూస్తే ద్వారక చూసిన అనుభూతి కలుగలేదు. అవే భవనాలు కొద్దిగా నైనా పురాతనముగా వుండేటట్టుగా కడితే బాగుండేది అనిపించింది.ఒకవైపు శ్రీక్రిష్ణుడు సంచరించి న పుణ్య ప్రదేశానికి వచ్చిన తృప్తి ,ఇంకోవైపు ఊహించినట్లుగా లేదన్న నిరుత్షాహము కలిగింది.

అక్కడ తిరగటానికి సుధీర్ అక్కడి ప్రదేశాలు తెలిసిన డ్రైవర్ తొ ఒక జీప్ అరేంజ్ చేసారు.అది ముందు డ్రైవర్ సీట్ పొడుగ్గా ,వెనకాల ఒక పొడుగు సీట్ ఆ వెనుక అడ్డముగా రెండుపక్కల రెండు సీట్ల తో విశాలంగా వుంది.మేము ద్వారక నుంచి వచ్చేసరికి డ్రైవర్ సముద్రము వడ్డున ఎదురుచూస్తున్నాడు.అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది.అందరము అలసిపోయాము.డ్రైవర్ తో ముందువైపు మా వారు సంజు ,వెనుక నేను ,జయ,బిపు కూర్చున్నాము.డ్రైవర్ అక్కడి విషయాలు ఎవో చెబుతున్నాడు.నేను ,జయ ఎదొ మాట్లాడుకుంటున్నాము.ఇంతలో డ్రైవర్ జీప్ ని మేన్ రొడ్ మీదనుంచి పక్కకి తిప్పాడు. ఇప్పుడు ఇటెక్కడికి రేపు పోదాము పిల్లలు నిద్రకు వచ్చారు అని మావారి అందామని ముందుకు వంగాను. ఇంతలో నాభుజం మీద చేయి పడింది.ఎవరా అని వెనక కి చూసాను. ఒక అమ్మాయి బహుషా పదహారు ,పదిహేడు వయసు వుండవచ్చు,నా వెనుక సీట్లో కూర్చొని వుంది.నేను చూడగానే నవ్వింది.వెన్నెల వెలుగు లో ఎర్ర చీరా ,పసుపు జాకిట్టు వేసుకొని గుజరాతి రకముగా తల పైన కొంగు ముసుగు వేసుకొని,గుడ్రటి మొహము తో మెరిసి పోతూ కనిపించింది.మేము జీప్ ఎక్కిన్నప్పుడు లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అర్ధము కాలేదు. మావారి అడుగుదామంటే నోట మాట రావటములేదు. వెనకకి ముందుకి చూస్తున్నాను.జీప్ ఒక చెరువు పక్కనుంచి చిన్న కొండ ఎక్కింది.అక్క్డద చెరువులో కొంతమంది ఆడవారు దీపాలు వదులుతున్నారు.చెరువు దాటగానే చిన్న గుడి దాని ముందు కొన్ని షాపులు కనిపించాయి. అక్కడ జీపు ని ఆపి మమ్మలిని దిగమన్నారు.వెనకకి చూద్దును కదా ఆ అమ్మయి లేదు.డ్రైవర్ ,మా వారు ఎమి మాట్లాడు తున్నారో వినటము లేదు.ఆయన వెనుకనే గుడి లోకి వెళ్ళాను.అక్కడ అమ్మవారి విగ్రహము చూడగానే అరె ఈ అమ్మాయి ఇప్పుడు మనతో వచ్చిందికదా అని నాకు తెలికుండానే గట్టిగా అరిచాను. మావారు జయ బిత్తర పోయారు.పుజారి ఎమిటి అని అడ్గ్గానే నేను జీపు లో చూసిన అమ్మాయి గురించి చెప్పాను.అప్పుడు ఆయన చెప్పింది ఇది: ఈ గుడి హరిసిద్దిమాతా ది.ఈ గుడి కింద నుంచి ఉజ్జయిని లోని హరిసిద్ది మాత గుడి కింది కి సొరంగ మార్గము వుంది.ఉజ్జయిని రాజు శత్రువుల నుంచి తప్పించుకొని ఆ దారి గుండా ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాడు.ఆయన శత్రువులను జయించి తిరిగి పాలనలో కి వచ్చిన్నప్పుడు ఈ గుడి కట్టించాడు.ప్రతి కార్తీక పౌర్ణమి కి అమ్మవారు ఉజ్జయిని నుంచి ఇక్కడి కి వస్తుంది అని నమ్మకము.అలాగే ఆరొజు ఎవరోవకరి కి దర్షనము ఇస్తుంది.ఈ రొజు కార్తీక పౌర్ణమి మీకు దర్షనము ఇచ్చింది అని చెప్పారు.ఇది నమ్మలేని నిజం.అసలు హరిసిద్దిమాత పేరె నేను ఎప్పుడూ విన్లేదు.అప్పుడు ఆ గుడి కి వస్తున్నట్లు కూడా తెలీదు.చివరి నిమిషములో డ్రైవర్ జీప్ అటు తిప్పాడు.ఇప్పటి కీ గుర్తుకు వస్తే వళ్ళు గగుర్లు పొడుస్తుంది

అమ్మవారి ని మనసారా పూజించుకొని తిరిగి వెళుతుండగా డ్రైవర్ ,అశ్వథామ ఈ పరిసరాలలో తిరుగుతూవుంటాడు.అప్పుడప్పుడు కొంతమంది చూసామని చెబుతుంటారు అన్నాడు.గది కి చేరాకా ,పిల్లలని నిడ్రపుచ్చి నేను ,జయ బాల్కనీ లో అశ్వధామ కనిపిస్తాడేమొ చూద్దామనుకుంటూ కూర్చొని హరిసిద్దిమాత గురించి చెప్పుకునంటున్నాము.అశ్వధామ అయితే కనిపించలేదు కాని ,ఒక అపూర్వమైన ద్రుశ్యము కనిపించింది.కార్తీక పున్నమి సంధర్భముగా చాలా మంది ష్త్రీలు సముద్రము వడ్డున నిలబడి పాటలు పాడుతూ సముద్రములో దీపాలు వదులుతున్నారు.మా అథిధి గృహం సముద్రము వడ్డుకు దగ్గరలో వుండటము మూలముగా మాకు చూసే భాగ్యము కలిగింది.కొద్దిసేపు తరువాత అంతా వెళ్ళిపోయారు.ఆ నిశబ్ద ,వెన్నెల రాత్రి అలల పై తేలి పోతున్న దీపాలు ,ఒహ్ వర్ణిచటము నా తరము కాదు.

చల్తే చల్తే మేరి ఏ బాత్ యాద్ రఖనాఖభీ అల్విదా నా కహనా