చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, December 28, 2010

హైదరాబాద్ లో పూరీజగన్నాథుడు

































ఈ మద్య మావారు అలా అలా జూబిలీ హిల్స్ లో కార్ లో నన్ను షికారు తిప్పుతూ వుండగా దూరం నుంచి మట్టిరంగులో ఓ గుడి గోపురం కనిపించింది . అరే ఇదేదో ఒరిస్సా గుడి గోపురం లావుందే అనుకొని , మావారిని అడిగాను . ఆయన ఇంతకు ముందు గమనిచలేదుట . పోనీ ఇప్పుడు వెళుదామా అనుకుంటే రాత్రి పదైంది . ఆ సమయము లో గుడి తలుపులు తీసి వుండవులే అనుకొని , ఆ గుడి ఎక్కడుందో వెతకకుండానే వచ్చేసాము . అప్పటి నుంచి ఆ గుడి చూడాలి అనుకుంటూ వున్నాను . కాని కుదరలేదు . ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు . ఆమెను ఎక్కడికైన తీసుకెళ్ళాలి అనుకున్నాను . ఈ రోజు సాయంకాలం వరంగల్ కు , ఓ పెళ్ళి కి వెళుతున్నాను . అందుకని నిన్ననే , వేరే ఎక్కడికో ఎందుకు ఆ గుడికే వెళితే బాగుంటుంది అనుకున్నాను . మా డ్రైవర్ ను ఆ గుడి గురించి అడుగుతే , ఆ గుడి కడుతుండగా చూసాను మేడం .ఒరిస్సా వాళ్ళు కట్టరట అన్నాడు . అవునూ మన లక్ష్మిగారు వుండగా ఇలా ఎక్కడా ఎక్కడా అని వెతుకులాట ఎందుకు అనుకొని లక్ష్మి గారి కి ఫోన్ చేసాను . అంతే వివరాలు తెలిసిపోయాయి !

జూబిలీ హిల్స్ లో , బసవతారక రామ కాన్సర్ హాస్పెటల్ దగ్గర , ఒరిస్సా వారు , పూరీజగ్నాదుని గుడి కట్టించారు . అసలు కట్టించింది ఎవరో తెలుసుకుందామనుకున్నాను కాని ఒరిస్సావాళ్ళు అన్నారు కాని ఎవరో చెప్పలేకపోయారు . కృష్ణ , సుభద్ర , బలరామ విగ్రహాలు అచ్చం పూరీ లో వున్నట్లుగానే స్తాపించారు . గుడి గోపురము , గుడి అంతా పూరిలో వున్నట్లుగానే కట్టారు. పూజారులు కూడా ఎక్కువగా అక్కడి వారే . గుడి ప్రాంగణం మధ్యలో జగన్నాధుడు , నాలుగువైపులలో ఓ పక్క , మా విమల , ఓ పక్క మహాలక్ష్మి . జగన్నాధ గుడి ద్వారము పక్క మారుతి , వెనుక చివర వినాయకుడు వున్నారు . వినాయకుని ముందు మూషికుడు కూడా వున్నాడు .

ఆలయము గోడల మీద భక్తుల చరిత్రలు చిత్రించారు . ఆలయము లోపల పైనంతా బాంగారు రంగులో చక్కటి చిత్రాలు వున్నాయి . ఎత్తైన గోపురము , ద్వజస్తంభము కనులకింపుగా ఠీవిగా వున్నాయి . చాలా ప్రశాంతముగా వున్నది . మేము 12 గంటల వరకూ వుంటుంది అనుకొని కొంచము ఆలశ్యం గా వెళ్ళాము . మేము వెళ్ళేసరికి పావుదక్కువ పదకొండు అయ్యింది . అందువలన ఎక్కువ సేపు దర్శనం చేసుకోలేక పోయాము . కాని ఆలయప్రాంగణం లో చాలాసేపే కూర్చున్నాము .
తప్పక చూడవలసిన దేవాలయము ఇది .


అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .