చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, February 22, 2011

అమీర్ పేట్ లోని అమ్మవారి దేవాలయాలు

1. శ్రీ కనకదుర్గ ఆలయము



చాలా సందడి గా వుండే అమీర్ పేట్ కూడలిలో వుంది , శ్రీ కనకదుర్గ దేవాలయము . గుడి మొద్ట్లోనే వినాయకుడు దర్శనం ఇస్తాడు . లోపలి కి వెళ్ళగానే , ఎదురుగా వినాయకుడు , నాగదేవత ల చిన్న గుడి వుంటుంది . ఎడమ చేతివైపు సంతోషీ మాత , కుడి చేతివైపు ఎల్లమ్మ వుండ గా మద్యలో నిలువెత్తు విగ్రహము తో శ్రీ కనకదుర్గ అమ్మవారు కళ కళ లాడుతూ దర్శనం ఇస్తారు . అమ్మవారి కి ఇరువైపులా యక్షిణులు వుంటారు . గుడి లోపల , గోడల మీద , అమ్మవారి వివిధ రూపాలతో శిల్పాలను వుంచారు . అసలు లోపల ఒక వినాయకుడు తప్ప ఇంకో పురుష దేవుడే లేడు . చుట్టూ ఎటుచూసినా అమ్మవారి ప్రతిరూపాలే !
ఇక్కడ , మంగళవారము రోజున , రాహుకాలము లో చేసే పూజ చాలా ప్రసిద్ధి చెందింది . ఇక్కడి పూజారి అందరి తోనూ సంకల్పం చెప్పించి శ్రద్దగా పూజ చేయిస్తారు . నేనూ ఓసారి చేసుకున్నాను . నేను అప్పుడప్పుడు వెళ్ళే దేవాలయాల లో ఇది ఒకటి .

* * * * * * *

2. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయము


కనకదుర్గ ఆలయము నుంచి కొంచం ముందుకు వెళితే వుంది ఈ ఆలయము . బలకం పేట అమ్మావారి గురించి చాలా సంవత్సరాల క్రితమే విన్నాను . కాని అప్పటి నుంచి వెళ్ళాలంటే కుదరలేదు . మొన్న ఆదివారము వెళ్ళాను . వెళ్ళగానే అబ్బా ఎంత మంది జనం అని భయం వేసింది . జాతర లా వుంది . ప్రతి ఆదివారము , మంగళవారము ఇక్కడ ఇలానే రష్ వుంటుందిట. సరే వచ్చాను కదా అని లోపలికి వెళ్ళాను .

ఇక్కడ అమ్మవారు నీళ్ళల్లో వుంటారు . పూర్వము ఇది అడవి అట. ఎవరికో భావి లో నీళ్ళు తోడుకుందామని వెళితే , నీటి పైన జుట్టు తేలుతూ కనిపించిందట. పరీక్షగా చూస్తే , ఎవరో పడుకున్నట్లుగా కనిపించిందట. అది దేవత విగ్రహం గా భావించి , అక్కడ గుడి కట్టించారట. ఇది అక్కడ ఒకావిడ చెప్పింది . ఆవిడ ముప్పై సంవత్సరాల క్రితం , వాళ్ళ అబ్బాయిని పుట్టెంటుకలు తీయించేందుకు ఇక్కడి తెసుకొచ్చిందట . అప్పుడు చుట్టూ పొలాలు వుండేవి . గుడి కూడా చాలా చిన్నగా వుండేది అని చెప్పింది . అక్కడివారు ఎల్లమ్మను చాలా మహిమగల తల్లి గా కొలుస్తారని చెప్పింది .

అమ్మవారి విగ్రహం దర్శించేందుకు కొంచము కిందకు వెళ్ళాలి . కింద భావి మీద అమ్మవారు పడుకొని వున్నట్లుగా స్తాపించారు . అక్కడ దర్శించుకొని కొంచము ముందుకు వెళ్ళి తే ఉత్స విగ్రహము వుంటుంది . ఆ హాల్ లో నే సర్వదర్శనం ఇస్తారట.

నేను ఎలా అందరి నీ నెట్టుకుంటూ అలా భూగృహం లోకి వెళ్ళి అమ్మావారిని దర్శించుకున్నానో తెలీదు . అదో వూపులా వెళ్ళిపోయాను . బహుషా అమ్మవారిని దశించుకునే అదృష్టం వుందేమో ! మళ్ళీ ఇంకోసారైతే వెళ్ళ లేను !

* * * * * * * * * * *

3.శ్రీకనకదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయము




అమీర్ పేట ట్రాఫిక్ లైట్ దగ్గర కుడి వైపున వుంది ఈ శ్రీకనకదుర్గ , మల్లికార్జున స్వామి దేవాలయము . కించము పరీశలన గా చూస్తే తప్ప కనిపించదు . ఆలయము బోర్డ్ కింద ఒక షాప్ కనిప్స్తే , ఒక క్షణం నాకు అర్ధం కాలేదు . పక్క నుంచి వున్న ద్వారము నుండి లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద గుడి కనిపించింది . చాలా ప్రశాంతము గా వుంది . ద్వారము ముందు విఘ్నేశ్వరుడు కొలువై వున్నాడు . లోపల కుడి వైపు మల్లికార్జునస్వామి , ఎడమవైపు కనకదుర్గ ముచ్చటగా వున్నారు . ఇది పురాతన దేవాలయము కాదనుకుంటాను .

* * * * * * * *

4.విజయలక్ష్మి దేవాలయము



ఎర్రగడ్డ రైతుబజార్ నుంచి యూసుఫ్ గూడా వెళ్ళేందుకు తిరిగే మలుపు మొదట్లోనే వుంది ఈ ఆలయము . దీనిని చినజీయర్స్వామి స్తాపించారట. లోపల విజయదుర్గ అమ్మవారి విగ్రహము చాలా కళ గా వుంటుంది . పక్కన మంఠపము లో రంగనాథస్వామి వున్నారు . ఈ ఆలయము ను ఓసారి అటు గా వస్తూ చూసి లోపలికి వెళ్ళాను .

ఇవీ , ఇంత వరకు నేను అమీర్ పేట్ లో చూసిన అమ్మవారి ఆలయములు .

Saturday, February 12, 2011

శ్రీ త్రిపురాంతక క్షేత్రం































సాయంకాలము మల్లికార్జునుని దర్శనం చాలా బాగా జరిగినందున చాలా తృప్తి గా అనిపించింది . మరునాడు ఉదయమే టిఫిన్ పని కానిచ్చుకొని , త్రిపురాంతకం బయిలుదేరాము . శ్రీశైల శిఖర దర్షనము నుండి కుడి వైపు ఘాట్ రోడ్ మీదు గా వెళితే శ్రీ త్రిపురాంతక క్షేత్రం వస్తుంది . వూరి లోని కి ప్రవేశించగానే ముందుగా త్రిపురాంతకీశ్వరుని దేవాలయము . కొద్దిగా కొండమీదికి ఎక్కి వెళ్ళాలి . ఇక్కడ పూర్వము త్రిపురాంతకుడు అనే రాక్షసుని ఈశ్వరుడు వధించి , ఇక్కడే వెలిసినందు వలన , ఈ దేవాలయము లోని స్వామిని శ్రీ త్రిపురాంతకేశ్వరుడు అని అంటారు .
ఈ దేవాలయములో పురాతన శాసనాలు , శిల్పాలు చాలానే వున్నాయి . కాని శిధిలవస్తలో వున్నాయి . ఆ శాసనాలు తెలుగులో లేవు . మరి ఆ భాష ఏమిటో నాకు అర్ధము కాలేదు . కాపోతే స్పష్టం గా కూడా లేక , చెక్కుకు పోయి వున్నాయి . బహుషా అందువలన కూడా అర్ధం కాలేదనుకుంటాను .

దేవాలయములో ఓ పక్కగా చిన్న గది వుంది . దానిలో నుండి , ఇష్టకామేశ్వరి దేవాలాయానికి , సొరంగ మార్గము వుందిట . దాని ని మూసి వుంచారు .

ఈశ్వరునికి అభిషేకము చేయించుకొని , కాసేపు కూర్చున్నాము . ఆ తరువాత అక్కడి నుంచి శ్రీ బాలాత్రిపురసుందరి దేవాలయాని కి వెళ్ళాము .

శ్రీ బాలాత్రిపురసుందరి దేవాలయము చాలా ప్రశిస్తి కలది . ఇక్కడ ఋషులు యాగము చేస్తుండగా , యజ్ఞగుండము నుంచి దేవి బాల రూపములో అవతరించింది .షోడశకళలతో అమ్మావారు బాలగా స్వయంభూగా వెలిసారు . ఆ మూర్తి లోని తేజస్సును ఎవరూ చూడలేకపోయారుట . శ్రీ ఆదిశంకరాచర్యులవారు , ఆ మూర్తిలోని 30 కళలను నిక్షిప్తము చేసారట . ఆ తరువాత వేరొక మూర్తిని , శ్రీచక్రమును అక్కడ స్థాపించారట . ఈ విగ్రహము పాత విగ్రహానికి ముందుగా వుంటుంది . ఇక్కడే శంకరాచార్యులవారు ' శ్రీ లలితా సహస్రనామాల ' ను వెలుగులోకి తీసుకొచ్చారట .

ఆలయ ప్రాంగణము లో ఒకప్పుడు వరుసగా కదంబ వృక్షాలు వుండేవట . ప్రస్తుతము ఒకటే వుంది . పక్కగా ఓ పెద్ద పుట్ట వుంది . అందులో పెద్ద పాము వుందని , అది రోజూ రాత్రి పూట ఆలయములోని అమ్మావారి విగ్రహం దగ్గరకు వెళుతుందని అక్కడి వాచ్ మాన్ చెప్పాడు !

వర్షాకాలము లో ఈ దేవాలయము నీటిలో మునిగిపోతుందట. అప్పుడు కొద్ది దూరములో వున్న ఇంకొక దేవాలయములో అమ్మవారి విగ్రహము వుంచి పూజిస్తారట .

మేము అమ్మవారి ముందు కూర్చొని లలితాసహస్రనామ పారాయణము చేసుకున్నాము .

తిరిగి వస్తూ శ్రీశైలం దగ్గరనే వున్న హటకేశ్వరం కూడా వెళ్ళాము . కాని గుడి తలుపులు మూసి వున్నందున , కటకటాల లోనుచే ఈశ్వరుని దర్శించుకొని వచ్చేసాము . సాయంకాలం మరోసారి మల్లికార్జున స్వామిని , బ్రమరాంబ అమ్మవారి ని దర్శించుకున్నాము .

మరునాడు ఉదయము రోప్ వే ఎక్కాము . నాకైతే కొంచం భయం వేసింది :) కృష్ణ లో అప్పటికి ఇంకా బోటింగ్ మొదలు కాకపోవటముతో రోప్ వే తో సరిపెట్టి , అక్కడి నుంచే కృష్ణమ్మ అందాలను చూసి వచ్చేసాము .

ఇహ రూం కు తిరిగి వచ్చి సామాను సద్దేసి తిరుగు ప్రయాణమయ్యాము . మరి వచ్చేస్తూ సాక్షి గణపతి దగ్గర హాజరు వేయించుకొవాలిగా . అదీ చేసాము . వూరికే దండం పెట్టుకోవటము కాకుండా గోత్రనామాలు చెప్పుకొన్నాము .

అక్కడ నుంచి కొద్ది దూరములో వున్న స్వామి పూర్ణానంద అశ్రమానికి వెళ్ళాము . మేము వెళ్ళిన సమయములో పూర్ణానంద స్వామి వారి కి హారతి జరుగుతున్నది . అందులో పాలు పంచుకున్నాము . అక్కడే స్వామీజీ కట్టించిన నారయణి అమ్మవారి ఆలయములో అమ్మవారిని దర్శించుకున్నాము . ఆశ్రమములో భోజన ప్రసాదము చేసాము . ఆశ్రమము చాలా ప్రశాంతము గా వున్నది . పూల చెట్లతో చక్కని కుటీరం లా ఎంత బాగుందో ! అక్కడ భక్తులు వుండేందుకు విశ్రాంతి గదులు కూడా వున్నయట .

మేము హైదరాబద్ చేరుకునేటప్పటికి సాయంకాలమైంది . మళ్ళీ ట్రాఫిక్ . . . . .

ఇంటికి చేరేటప్పటికి 8 గంటలైంది .

* * * * * * * * * * * * * * * * * * * * * * *

ఈ రోజు లక్ష్మి గారి జన్మదినము . అందుకే వారికి మా ఈ యాత్ర పోస్ట్ ను కానుకగా ఇస్తూ ,

లక్ష్మిగారు ,
మీరు ఇలాగే యాత్రలు చేస్తూ , మాతోనూ యాత్రలు చేయిస్తూ ,
ఆయు ఆరోగ్యాల తో సౌభాగ్యవతి గా వుండాలని కోరుకుంటూ ,
జన్మదిన శుభాకాంక్షలు .

Wednesday, February 9, 2011

శ్రీ మహేశ్వరం క్షేత్రం




ఈ మద్య లక్ష్మి గారి ఫ్రెండ్షిప్ లో పురాతన దేవాలయాలు చూడాలని అనిపించి , అప్పుడప్పుడు నేనూ , లక్ష్మి గారు మా అమ్మా వెళ్ళి వస్తున్నాము. అలా పోయిన వారం శ్రీశైలం వెళ్ళి వచ్చాము . శ్రీశైలం ఇంతకు ముందు చాలా సార్లే వెళ్ళాను కాని చుట్టు పక్కల ఒక్క ఉమా మహేశ్వరం తప్ప ఇంకేదీ చూడలేదు . ఈసారి త్రిపురాంతకం చూద్దామని వెళ్ళాము . ఉదయమే 7 గంటలకు మా కార్ లో , నేను , లక్ష్మి గారు , మా అమ్మ , మా డ్రైవర్ మల్లేష్ సారధ్యం లో బయలుదేరాము . లక్ష్మి గారు బ్రేక్ ఫాస్ట్ , నేను లంచ్ పాక్ చేసుకొచ్చాము . పొద్దున్నే హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయట పడేందుకే రెండు గంటలు పట్టింది . సిటీ ఔట్స్కర్ట్ దాటాక బ్రేక్ ఫాస్ట్ కానిచ్చాము .

హైదరాబాద్ శం షాబాద్ ఏర్పోర్ట్ రోడ్ దాటి హైవే మీద శ్రీశైలం దిశగా వెళ్ళేటప్పుడు , దాదాపు 30 కిలోమీటర్లు దూరం లో వున్నది ' మహేశ్వర ' క్షేత్రం . పూర్వ కాలం లో ఋషులు , మానవులు , దేవతలు తమ కష్టాల నుంచి రక్షించమని శివుని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా వారికి ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చటమే గాక , వారి కోరిక మేరకు ఇక్కడి పుష్కరిణి లో రాజరాజేశ్వరుడి గా వెలిసాడు . ఇక్కడ పై దేవాలయము లో రాజరాజేశ్వరుడు , ఆ దేవాలయమునకు కిందిభాగములోని దేవాలయము లో రాజరాజేశ్వరి దేవి పూజలందుకుంటున్నారు . ఈ ఆలయము చుట్టూ షోడశ మూర్తులు అంటే పదహారు శివ రూపాలు ప్రతిష్టించారు . ఆలయము ముందు రావి చెట్టు నీడలో వినాయకుడు , నాగదేవతల గుడులు చిన్నవి వున్నాయి . అవి బహుషా ఈ మద్యకాలము లో నిర్మించివుంటారు . మహేశ్వరములోని చారిత్రిక కట్టడాలు 13 వ శతాబ్ధం లో కాకతీయుల కాలము లో నిర్మించినట్లుగా ఆధారాలు వున్నాయి . ఐతే తరువాత పాలించిన కుతుబ్ షాహీ రాజులు కోటను పొడిగించినట్లు చరిత్ర లో వున్నది . క్రీ. శ. 1672 కు పూర్వము మహేశ్వరం ప్రాంతమంతా దట్టమైన అడవుల తో నిడి వుండేదట . పరిసర ప్రాంతాలలో చెప్పుకోదగిన పెద్ద గ్రామాలేవీ లేకుండెనట . తానీషా కాలం లో అక్కన్నమాదన్నలచే ఆకర్షింపబడి శివకేశవలయాల నిర్మాణానికి , గ్రామ నిర్మాణానికి కారణమైనదట . ఈ క్షేత్ర నాయకుడు మహేశ్వరుడు కనుక ఆయన పేరునే ఈ గ్రామానికి మహేశ్వరము అనే పేరు వచ్చిందట .అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి , మిగితా ఆలయాల నిర్మాణానికి పూనుకున్నట్లుగా ' అక్కన్నమాదన్నల చరిత్రలో ' వున్నదట .

రాజరాజేశరుని , రాజరాజేశ్వరినీ దర్శించుకొని , అర్చన కుంకుమార్చన చేసుకున్నాము . రాజరాజేశ్వరి ఆలయములో ఓ చిన్ని పూజారి మా తో శ్రీచక్రమునకు కుంకుమార్చన చేయించారు . ఆ పూజారి మమ్మలిని దీవించాడు కూడా .

అక్కడి నుంచి తిరిగి శ్రీశైలం కు బయలుదేరాము . శ్రీశైలము లో మల్లికార్జునస్వామి మందిరమునకు దగ్గరలో వున్న ' వాసవీ సత్రము ' లో రూం తీసుకున్నాము . అక్కడే భోజన సదుపాయము కూడా వున్నది . రాత్రి 9 గంటలకు మల్లికార్జునస్వామి ని దర్శించుకున్నాము . ఆ రోజు ఆలయము లో మా అదృష్టము ఎక్కువగా రెష్ లేదు . మేము ఏ క్యూలోనూ నిలబడ కుండానే నేరుగా గర్భ గుడి వరకు వెళ్ళగలిగాము . చాలాసేపు స్వామివారిని దర్శించుకున్నాము . బ్రమరాంబ అమ్మవారిని కూడా దర్శించుకొని చాలాసేపు ఆలయప్రాంగణములో కూర్చున్నాము .