చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, May 19, 2011

భాగ్యనగరము-సాంప్రదాయాలు

హైదరాబాద్ లో పండుగలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ.ఆషాఢ మాసము లో గ్రామదేవతలకు చేసేది ఈ పండుగ. బోనము అంటే నైవేద్యము.ఎవరెవరి మొక్కులను బట్టి వారు అమ్మవారికి నివేదన చేస్తారు.ఒకప్పుడు బలులు ఇచ్చేవారట. కాని ఇప్పుడు మటుకు అన్న నైవేద్యమే ఇస్త్తున్నారని విన్నాను.ముఖ్యముగా ఎక్కువగా ఆషాడమాసములో వచ్చే ఆదివారాలు చేస్తారు. ఆ రోజు ఉదయమే తలస్నానము చేసి శుచిగా అమ్మవారి కి నైవేద్యము-బోనము వండి అలంకరించిన కొత్తకుండ లో పెట్టుకొని, తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి కి వెళ్ళి నివేదన చేస్త్తారు.కొత్త పట్టు చీరలు కట్టుకొని, చక్కాగా అలంకరించుకొని ,బోనాల కుండని తల మీద పెట్టుకొని ముత్తయిదువలూ,కన్నెపిల్లలు,కొత్త పెళ్ళికూర్తులూ వెళుతుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలవు.పిల్లా పాపలు చల్లగా ఆరోగ్యముగా వుండాలని,వర్షాలు సక్రమముగా పడి పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు.చివరి వారము లో సికంద్రాబాద్ మహంకాళి ఆలయము లో పెద్ద ఎత్తున చేస్త్తారు.ఆ రొజు పూజారిణి మీదకు అమ్మవారు వచ్చి భవిష్యవాణి చెపుతుందని అందరి నమ్మకము.

నేను ఒక ఆదివారము ఇంట్లోనే అమ్మవారి కి పెరుగన్నము నివేదన చేసి,ఒక కొబ్బరి కాయ,జాకెట్టు బట్ట ,పసుపు ,కుంకుమ,గాజులు దగ్గర లోని అమ్మవారి గుడి లో ఇస్త్తాను.


బతుకమ్మ పండుగ మా అత్తవారింట్లొ చేసే అలవాటు వుంది.తంగేడు పూలు,పున్నాగ మొదలైన పూలు ఒక పెద్ద పళ్ళెము లో ఆకు వేసి దాని మీద అందముగా అలంకరించి,పైన తమలపాకు లో చిన్న పసుపు గౌరమ్మ ని పెట్టి,చిన్న కొత్త బట్టలో బియ్యము రుపాయి కాసు పెడతారు . అదే బతుకమ్మ.ఎవరు ఎంత ఎత్తుగా పేరుస్త్తారు అన్నది పోటి.పల్లెటూళ్ళ లో అయితే రకరకాల పులతో చాలా కళాత్మకముగా పేరుస్త్తారు.ఆ బతుకమ్మలని మద్యలో వుంచి ఆడవారంతా చుట్టూ తిరుగుతూ,చప్పట్లు తడుతూ,కొలాటాలు ఆడుతూ ,

ఒక్కొ పువ్వేసి చందమామా అని ఒకామె పాడుతే,

పడక కుర్చీలోని ఓ రాజశేఖరా మా అన్నలొచ్చారు మమపుతారా,మీ అన్నలొస్త్తేను కోల్ మాకేమి తెచ్చారు కోల్,
అత్తకు అద్దాలా రవికా కోల్,మామకు పట్టంచు దొవ్తీ కోల్ అని ఇంకో ఆవిడ అందుకుంతుంది.
ఒకరు చెబుతుంటే మిగితావాళ్ళు గొంతు కలుపుతారు.ఈ రకముగా పూజించి చివరకు నీళ్ళ లో

పోయిరా మాయమ్మ పొయిరావమ్మా ,పొయి నీ అత్తింటనూ సుఖముగా నుండు,
మగడేమన్ననూ మారాడబోకు ,ఎవరేమన్ననూ ఎదురాడబోకూ
అంటూ సుద్దులు చెబుతూ సాగనంపుతారు.

దసరా దేవీ నవరాత్రులలో ఒకవైపు బతుకమ్మగా పూజలందుకుంటూ ,ఇంకొవైపు శంకరమఠ ము లో రోజొక అలంకరణతొ అమ్మవారు శొభిల్లుతుంటారు.

ఇవే కాకుండా వినాయకచవితి మొదలైన పండుగలు కుడా జరుపుతారు.కాని ఇవి ఇక్కడి సాంప్రదాయ పండుగలు. ఈ పండగలప్పుడు సందడి చూడాలంటె బర్కత్పురా,చిక్కడపల్లి,అశోకనగర్ ,నల్లకుంట,విద్యానగర్ లలో చూడాలి.ఇవి మా ఇలాకాలు.అందుకని నాకు ఇక్కడి సంగతే తెలుసు.నల్లకుంట ,చిక్కడపల్లి మార్కెట్ల లో అయితే పండగలప్పుడు మొగలి పూలు,కలవ పూలు కుడా దొరుకుతాయి.
ఇక గుడుల విషయాని కి వస్త్తే మాకు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా అలవాటు.మా ఇంట్లొ కొత్తదంపతులు ముందుగా దర్షించుకునేది ఈ స్వామినే.మా కుటుంబము లోని పిల్లల అన్నప్రాసన,అక్షరాభ్యాసము,పుట్టివెంటుకలు అన్ని ఇక్కడే.
ఈ పరిసరాలన్ని ఎక్కువగా మద్యతరగతి వారు నివసించేవి.భాధ్యతలు తీరి,రిటైర్ అయిన నడివయసు దంపతులు ఇక్కడ సుఖంగా నివసించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.ముఖ్యముగా చిక్కడపల్లి లో ఐతే పొద్దున్నే సుధా హొటల్ నుంచి టిఫ్ఫిన్ తెచ్చుకొని,మధ్యహ్నము బందరు మిఠాయి దుకాణములో ఓ నాలుగు సీసాలు ఇస్త్తే కమ్మటి పచ్చడులు ఇస్త్తాడు -వాటిలోకి వేడి అన్నము వండుకొనితినేసి,సాయంకాలము పక్కనే వున్న ఏ థియేటర్ లో సినిమానో,లేదా త్యాగరాయగానసభ లో ఏ ప్రోగ్రామో చూసేసి ,అదీ కాదంటే సత్యనారయణ స్వామి గుడిలో పురాణ కాలక్షేపాని కో వెళ్ళివస్తూ హాయిగా ఏ చికూ చింతా లేకుండా గడపవచ్చు.

ఇలా నల్భై సంవత్సరాలనుండి మెట్టినిల్లు,పది సంవత్సరాలనుండి పుట్టిల్లు కుడా అయినా మా హైదరాబాద్ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే వుంది.కాని ఎంతని చెప్పను?ఒక షహెరి (ఉర్దూ కవిత) ఐనా చెప్పకుండా ఆపేస్తే అసంపుర్తిగా వుంటుంది.మా ఫ్రెండ్ ప్రభ ఈ షెహారీ లు చెప్పటము లో దిట్ట.ఆమె చెప్పిన ఒక చిన్న షెహరి,
ఉత్తరాలు రాయటాని కి బద్దకించిన ప్రియుడి తో ప్రియురాలు,
యా ఇలాహి,క్యా సబబ్ హై,
మొహబత్ ఖతం హై,
యా ఢాఖానా బంద్ హై

భాగ్యనగరము -సుందరనగరము




హైదరబాద్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్.,హైదరబాద్ చరిత్రకు గురుతుగా ,ప్లేగ్ మహమ్మారినుండి రక్షించేందుకు గాను పదిహేనువందల తొంబైఒకటి లో కులికుత్బ్ షా నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. .పైవరకు ఎక్కి చూస్తే హైదరబాద్ మొత్తమును దర్షించవచ్చు

.మొత్తము ఏడుగురు కుతుబ్ షా వంశీయులు గొలుకొండ కోట నుండి హైదరాబాద్ ని పాలించారు.అందరు కుడా ఇక్కడి సన్స్క్రుతి ,సాహిత్యాలను పొసించారు. అలాగే వ్యాపారాన్ని కూడా వౄద్ది పరిచారు.ముక్యముగా ముత్యాలు,వజ్రాల వ్యాపారము ఎక్కువగా సాగేదివ్యాపారాభివ్రుధే కాకుండా పట్టణము అంతా బాగ్ (తోటల) తో సుందరముగా తీర్చి దిద్దారు.విదేసీయులు దీని అతి సుందరమైన ,ఇరాన్ లో వున్న ఇస్ఫాన్ తో పోల్చేవారు.

తరువాత పదిహేడువందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలబై ఏనిమిది వరకు పాలించిన నవాబులు హైదరబాద్ ను ఇంకా అభివౄద్ది చేసారు..మీర్ ఉస్మాన్ అలి ఖాన్ ఉస్మానియా హాస్పిటల్ ,ఉస్మానియా విశ్వవిద్యాలయము స్తాపించారు.అవి ఇప్పటికి ప్రజలకి ఎనలేని సేవ చేస్తున్నాయి.

ఉస్మానియా విశ్వ విద్యాలయములో అప్పుడు ఎక్కువగా ఉర్దూ మిడీయం లోనే ఎక్కువగా భోధన జరిగేది.మా మామగారు,మానాన్నగారు ఉర్దు లోనే చదువుకున్నారు.వాళ్ళ సర్టిఫికేట్స్ ఉర్దూ లోనే వున్నాయి.
ఇక పెద్ద పెద్ద భవనాలని నిర్మించారు.హైదరాబాద్ దివాన్,సాలార్జంగ్ నిర్మించిన సాలార్ జంగ్ ప్రదర్శనశాల ప్రపంచ ప్రసిద్ది పొందింది..
ఇక ప్రస్తుతాని కి వస్తే చార్మినార్
పక్కనే వున్న చూడీ బజార్ లో రకరకాల గాజులు మరులు కొలుపుతూ వుంటాయి.లక్క మీద చిన్న చిన్న గాజు ముక్కలు,అద్దాలు,పూసలు అతికిస్తూ ఇంత అందంగా ఎలా చేయగలరొ!చీర మీదికైనా ,డ్రెస్స్ మీదికైనా ఏరకము దుస్తుల మీదికైనా అందంగా అమరిపొతాయి.వాటి నైపుణ్యానికి అశ్చర్యపొకమానము.
పక్కనే ముత్యాల సరాలు.చిన్నవి,పెద్దవి అబ్బొ ఎన్ని రకాలొ!

యన్ .టి రామారావు గారి హయాము లో టాంక్ బండ్ దగ్గర ప్రముఖుల విగ్రహాలు,టాంక్ బండ్ మధ్యలో బుద్ద విగ్రహము ఏర్పరిచి పట్టణాని ఇంకా సుందరముగా తీరిచి దిద్దారు.
ఇలా చెప్పుకుటూ పోతే ఎంతైనావుంది.
నాకు నచ్చిన విగ్రహము సెక్రటేరియట్ ముందువున్న తెలుగుతల్లి విగ్రహము.


Get this widget | Track details | eSnips Social DNA