చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Friday, September 17, 2010

శివయ్య సన్నిధి లో మా వినాయకచవితి




శివ
శివ మూర్తివి గణనాథా
నువు శివుని కొమరుడవు గణనాథా

మద్య హైదరాబాద్ లో కాలనీ లలో పెట్టిన వినాయకుని దగ్గర మనము పూజ చేసుకునేందుకు , పూజారిని, పూజ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు . అలా ఔరంగాబాద్ లో ఏమైనా వీలుందా అని మావారు వెతికారు . కాని లేదట. సరే అనుకొని , ఔరంగాబాద్ కు 30 మైళ్ళ దూరము లో నున్న , ఎల్లోరా వద్ద , వేరూళ్ గ్రామం దగ్గర , శివాలయ్ అనే తీర్థ స్తానం లో ఘృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం వుంది . అక్కడకు వెళుదామనుకొని , వినాయకచవితి రోజు ఉదయమే 6.30 కు కార్ లో బయలు దేరి వెళ్ళాము .ఎల్లోరా దగ్గరకు వెళ్ళగానే అక్కడే మేన్ రోడ్ మీద " గరికపాటి రెస్టారెంట్ " తెలుగు వారిచే నడపబడుతున్నది కనిపించింది . అక్కడ ఆగి , ఘృష్ణేశ్వర స్వామి దగ్గర , సరిగ్గా పూజ చేయించేవారు , సరైన పూజారి వున్నారా అంటే సింగ్డే అని , ఒక పూజారి వున్నాడని , ఆయన శ్రద్దగా చేయిస్తాడని చెప్పారు . గుడి దగ్గర ఆయనను సంప్రదించాము . ' పూర్ణరుద్రాభిషేకం ' చేయిస్తాన్నారు . మావారికి కావలసింది అదే . 2001 రూపాయల తో అభిషేకం టికెట్ కొనుక్కొని , గుడి లోకి వెళ్ళాము . రోజు , శ్రావణమాసమంతా ధీక్ష చేసినవారు ఉద్యాపన చేసుకుంటున్నారు . అక్కడ ఉద్యాపనగా శివుడికి అభిషేకం చేయుంచుకున్నాక , ఇంట్లో వినాయకుని స్థాపిస్తారట. అందువలన గుడిలో రెష్ గా నేవుంది . మేము వేట్ చేస్తున్న సమయములో సింగ్డే , అక్కడి స్థల మహిమ ఇలా చెప్పారు

కైలాసం లో శివ పార్వతులు చదరంగం ఆడుతున్నారు . ఆటలో పార్వతి గెలిచింది . దాని తో శంకరునికి కోపం వచ్చి, ధక్షణానికి వెళ్ళి సహ్యాద్రి పర్వతాల మీద నివసించసాగాడు . శంకరుని వెతుకుతూ , పార్వతి కూడా అక్కడికి భిల్లురూపం లో వచ్చి శంకరుని మనసు దోచుకుంది . ఇద్దరూ ప్రదేశము లో వున్నారు . ఒకసారి పార్వతికి దాహం వేసిందిఅప్పుడు శంకరుడు భూమి లోకి త్రిశూలం గుచ్చి , పాతాళం నుండి భోగావతి నీటిని పైకి తప్పించాడు . దానికి శివ తీర్థంఅని , వనాన్ని కామ్యకవనం అని పరు వచ్చింది . ఒక రోజు పార్వతి , పాపిట లో అలంకరించుకునేందుకు , ఎడమచేతిలో కుంకుమ ,కేసరి లో శివాలయం నీరు కలిపింది . కలుపుతుండగా చేతిలో కుంకుమ తో శివలింగం తయారైంది . లింగము నుండి దివ్య జ్యోతి ఉద్భవించింది . అప్పుడు , ఆశ్చర్యముతో చూస్తున్న పార్వతి తో శివుడు ఇలా అన్నాడు ,
" లింగం పాతాళపు అడుగున వుండేది . ఇది త్రిశూలం నుంచి వచ్చింది . అప్పుడు భూతలం ఒకసారి ఎగిసిపడింది , నీటి ఉడుకులాగా " ( కాశీ ఖండం )
పార్వతి దివ్య జ్యోతిర్లింగాన్ని , ఒక రాతి లింగము లో వుంచి , విశ్వ కళ్యాణార్ధం లింగ మూర్తిని ఇక్కడ ప్రతిష్టించింది .
ఈ జ్యోతిర్లింగము ను కుంకుమేశ్వరుడు అని , ఘృష్ణేశ్వరుడు అని నామములతో పిలుస్తారు .
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది చివరిది .

గుడి లోపలికి వెళ్ళగానే నాకు చాలా ఉక్కిరిబిక్కిరి గా అనిపించింది . అందులోనూ చాలా మంది వున్నారు . గుడిద్వారము కూడా చిన్నగా వుంది . నేను చూసినంతవరకు , శివాలయాల లో గర్భ గుడి లోని లింగానికే సొంతముగాఅభిషేకము చేయనిస్తారు . కాకపోతే ఇక్కడ దంపతుల తో చేయిస్తున్నారు . సంకల్పము కాగానే , నేను బయటకు వెళ్ళికూర్చుంటాను అని మావారి తో అన్నాను . నీ ఇష్టం , కావాలంటే ఇప్పుడైనా వెళ్ళిపో అన్నారు కాని , అందరూదంపతులు చేస్తుంటే , ఆయనను ఒక్కరిని వదిలి వెళ్ళాలనిపించలేదు . అలాగే వంతు వచ్చేవరకు నిలుచున్నాను . మేము పూజ మొదలు పెట్టాక బయటకు వెళ్దామనుకున్నది మర్చి పోయి పూజలో మునిగి పోయాను . విచిత్రముగా మా పూజ మొదలయ్యే సరికి దాదాపు అందరూ అభిషేకాలు ముగించుకొని వెళ్ళి పోయారు మహారుద్రాభిషేకము గంటపైనే పట్టింది . తరువాత , జ్యోతిర్లింగానికి ఎదురుగా వున్న పార్వతీ అమ్మవారి కి కుంకుమ పూజ చేసాము . అలా వినాయకచవితి రోజున , విఘ్నేషుని అమ్మా నాన్నలను పూజించాము . చాలా గొప్పగా ఐంది కదూ . చూశావా నిన్ను ఆయన బయటకువెళ్ళనీయలేదు అన్నారు మావారు . మరే ఆయన తన డైమండ్ నెక్లెస్ ను పంపి మరీ పిలిపించుకున్నాడు కదా అన్నానునేను .

తరువాత దగ్గర లోనే వున్న అష్టవినాయకుని గుడి కి వెళ్ళాము . గుడి విశేషము ;
" మొదట ఇక్కడ నాగజాతి ఆదివాసులుండేవారు . నాగుల స్థానం ' బాంబీ ' అంటే పాముల పుట్టలు . వీటిని ' వారుళ్ ' అంటారు . అదే కాలక్రమేనా ' వేరుళ్ ' గా మారింది . అది ' యేరుళ్ ' గ్రామం గా పేరు పొందింది . దీనిని ' యెల ' అనే రాజుపాలిస్తూ వుండేవాడు . ఒకసారి యెల రాజు వేటకు వెళ్ళి , వేటలో మునులుండే ఆశ్రమాలకు చెందిన జంతువులనుకూడా చంపివేసాడు . అది చూసి మునులు , రాజును సర్వాంగాలు పురుగులు పట్టాలని శపించారు .

విధం గా రాజు అడవుల వెంట తిరగ సాగాడు . దాహం తో గొంతు ఎండి పోసాగింది . ఎక్కడా నీరే లభించలేదు . చివరకు ఒక చోట ఆవు డెక్కల తో చేయ బడిన గుంట లలో కొద్దిగా నీరు కనిపించింది . నీరు రాజు నోట పోసుకోగానే , ఒక అద్భుతం జరిగింది . రాజు శరీరానికి పట్టిన పురుగులన్నీ మటు మాయం అయ్యాయి . అప్పుడు రాజు ప్రదేశం లోతపస్సు చేసాడు . బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు . అక్కడ అష్ట తీర్థాలను ప్రతిష్టాపించాడు . దగ్గర లోనే ఒక సువిశాలమూ , పవిత్రమూ అయిన సరోవరాన్ని నెలకొల్పాడు . ఇక్కడే అష్ట వినాయకులు వున్నారు .

అటు నుంచి , గరికపాటివారి హోటల్ లో భోజనము చేసి , ఎల్లోరా గుహలను చూసి ( ఎల్లోరా విశేషాలు ఇంకో పోస్ట్ లో ) , తిరుగు ప్రయాణము లో ఖుల్దాబాద్ దగ్గర ' బద్ర మారుతి ' ని దర్షించుకున్నాము . ఆలయము చాలా పురాతనమైనదికాకపోతే మద్యనే అందరి కీ ఎక్కువగా దీని గురించి తెలిసింది . ఇక్కడ హనుమంతుడు శయనించి వుంటాడు .
ఔరంగాబాద్ వచ్చేసరికి , సాయంకాలమైంది . మాకు ఊరి మొదట్లోనే వినాయకుడు రకరకాల రూపాలతో , కొలువైయేందుకు వెళుతూ దర్షనమిచ్చాడు .
13 తారీకున మావారి పుట్టిన రోజు . రోజు ఆయన పని నుండి వచ్చాక , ఒక ఆటో మాట్లాడుకొని , మీ వూరి లో ఏమిచూపిస్తావో చూపించు అన్నాము . అతను వినాయకులను చూపిస్తాను అని , చిన్న చిన్న సందుల లోకి తీసుకెళ్ళి మరీచూపించాడు . చాలా మటుకు పెద్ద పెద్ద విగ్రహాలే . అవన్ని ఎప్పటికీ అలాగే వుంటాయట . పక్కన చిన్న విగ్రహం వుందిదానిని నిమజ్జనము చేస్తారట. ఒక చోట , మేము హైద్రాబాద్ నుండి వచ్చామని తెలుసుకొని , అక్కడి నిర్వాహకులు ,రోజు లోకల్ న్యూస్ లో ఖైరతాబాద్ వినాయకుని చూపించారని చెప్పారు . ఇంకో చోట రావి చెట్టు చుట్టూ హిమాలయాలలాగా ఏర్పరిచి , దాని మీద పన్నెండు జ్యోత్ర్లింగాలను పెడుతున్నామని చెప్పి మావారి దగ్గర చందా వసూలు చేసారు . చీకటిలో కనిపిస్తున్నాడే పాలరాతి వినాయకుడు , ఆయన ' వరద వినాయకుడు ' అట. వి . . పి వినాయకుడుట . పెద్దపెద్ద వాళ్ళు దర్షించుకుంటారుట . మేమెళ్ళేసరికి తలుపులు వేసేసారు . బయట నుండే దండం పెట్టు కొని వచ్చేసాము . ఇలా ఊళ్ళోని ముఖ్యమైన వినాయకులను చూపించి , ఊరి చివర హోటల్ లో భోజనము పెట్టించి , మా హోటల్ దగ్గరదింపి 450 రూపాయలు వసూలుచేసాడు ఆటో డ్రైవర్ గారు ! 100రూపాయలో అవుతుంది , పైనుంచి ఇంకో వంద భక్షీష్ఇద్దామనుకున్నారు మావారు పాపం . అక్కడికీ ఆటో డ్రైవర్ గారు మీటర్ ప్రకారమే చార్జ్ చేసారట. కాకపోతే అక్కడ , మీటర్ లో ఒక రూపాయైతే , పది రూపాయలట. పది రూపాయలైతే వందరూపాయలట . అదేమి లెక్కో నాకైతే అర్ధం కాలేదు . 45 రూపాయలు మీటరులో వుంటే 450 తీసుకున్నాడు !!!

సారి వెరైటీగా వినాయకునికి మహరాష్ట్ర ప్రసాదము ' మోదక్ ' చేద్దామనుకున్నాను . కాని మహరాష్ట్ర ప్రసాదమైతేచేయలేదు కాని , మహారాష్ట్రా లో ఇలా వినాయకచవితి చేసుకున్నాము .

చివర ఫొటో లో వున్న వినాయకుడు , మా మనవరాలు మేఘ చేసిన , మా ఇంటి వినాయకుడు .

5 comments:

lakshmi sravanthi udali said...

photos chala bagunnayandi
aa modati photolo unna peddaayanni modata chusi k. viswanaadh garanukunnanu :)

అశోక్ పాపాయి said...

avunadi photos baaga tisharu..mee inti vinayakudu kooda chaala bagunnadu

మాలా కుమార్ said...

naenu chesina vinayakudu chaala time patindhi.thankyou for likeing my vinayakudu.:)


your friend,
megha

మాలా కుమార్ said...

లక్స్మి గారు ,

శివ శివా , ఆ ఫొటోలో వున్నది , నేనూ మావారు . అక్కడ ఓ అబ్బాయి 30 రూపాయలకే , వెనక గుడి వచ్చేట్లుగా తీస్తానంటే సరే అని తీయించుకున్నాము . ఇదో ఇలా గుడి తో పాటు బోలెడు షేడ్స్ తో తీసాడు .

కొత్త పాళీ said...

బాగు బాగు.