చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Friday, April 2, 2010

రాజమండ్రి - 2





మొదటి సారి సిలిగురి వెళ్ళేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ చూసాను . అప్పుడు , అక్కడ , పసుపు , ఆకుపచ్చ డాట్స్ తో వున్న బత్తాయిలను చూసి , తెగ హాచర్య పోయి , ముచ్చటపడి కొన్నాను . ఆపైన రుచి మరిగి ఎప్పుడు సిలిగురి వెళ్ళేటప్పుడు , తిరిగి వచ్చేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ లో బత్తాయిలు , వైజాగ్ స్టేషన్ లో కందిపొడి , విజయవాడ స్టేషన్ లో భోజనము తప్పనిసరైపోయాయి . రాజమండ్రి వస్తోంటే చాలు గోదావరి అందాలు చూడటానికి ఎవరినీ పట్టించు కోకుండా కిటికీ దగ్గర సెటిల్ ఐపోయేదానిని . అప్పుడే డిసైడ్ ఐపోయా జీవితములో ఒకసారైనా రాజమండ్రి స్టేషన్ లో దిగి , కోనసీమ లో గోదావరి అందాలు చూడాలని , ముచ్చట కొలిపే బత్తాయిలను తినాలని !!!!

ఆ కోరిక మొదటిసారిగా మా ఆడపడుచు విజయ పెళ్ళి లో తీరింది . తనతో పాటు మూడు నిద్రలకి వాళ్ళ అత్తవారి వూరు , గుమ్మళ్ళదొడ్డి వెళ్ళాను . మా ఇంట్లో గోదావరి జిల్లాలవారితో వియ్యమందటము కూడా అదే మొదటిసారి . వాళ్ళ భాష , అలవాట్లు చాలా గమ్మత్తుగా అనిపించాయి . గుమ్మళ్ళదొడ్డి లో వాళ్ళ ఇల్లు , ఆవూరు అచ్చం సినిమాలలో చూపించినట్లుగానే వున్నాయి . సిరిసిరిమువ్వ సినిమా అక్కడే తీసారుట . ఆ తరువాత మావారు ట్రాన్స్మిషన్ లైన్ లోకి వచ్చాక పని మీద వెళుతుంటే నేనూ వెళ్ళాను . అదేమిటో , ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కారణము తో రెండు రోజుల కే తిరిగి వచ్చేయాల్సి వచ్చేది ! ఇది కాదు పని అని , నా పోరు పడలేక అక్కడ ఓ వర్క్ తీసుకున్నారు . రాజమండ్రి దగ్గర రాజోలు లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు .
ఓ శుభముహుర్తాన , చలో అనుకుంటూ వెళ్ళాము . అక్కడ ఇల్లు చూడగానే సీతారామయ్యగారి ఇల్లు లాలేదే అని కాస్త నిరుత్సాహం వేసిన మాటనిజమే . కాని సద్దేసుకున్నాను. మేము వెళ్ళేసరికి నీళ్ళురావటము , వెనక్కి పోవటము ( ? ) ఐపోయాయి . ఒక్క చుక్క నీరు లేదు ఎలాగా అనుకుంటూ వుంటే మావారికి గోదావరి లో స్నానం చేసేస్తే పోలే అనిపించి పక్కింటి ఆయనను , ఇక్కడికి దగ్గరలో గోదావరి ఎక్కడవుందీ అని అడిగారు . పట్టిసం ఇక్కడికి దగ్గరే , అక్కడ స్నానం చేసి , వీర్భద్రీశ్వరునికి అభిషేకం చేయించు కోండి , ఈ రోజు కార్తీక సోమవారం , చాలా మంచిది అన్నారు . అంతే రాజమండ్రి దగ్గర నావ ఎక్కి పట్టీసం చేరుకున్నాము . గోదారి గంగమ్మ స్నానాలు చేయంగ అనుకుంటూ హాపీగా స్నానం చేసి , కొండ ఎక్కి ఈశ్వరుని దర్షించుకొని , అభిషేకం చేసి వచ్చాము. .

ఓవారం రోజులు ఆయన బిజీగా వున్నా నాకేమి దిగులేయలేదు . మేమున్న కాలనీ లో , మా వక్కటితప్ప అన్ని ఒకే కుటుంబానివి . అందరూ గోడల మీదనుండి పెద్ద గొంతు తో మాట్ల్లడుకోవటము , ఏదైనా తేడావస్తే , పెద్దగా అందరూ కలిసి ఆ తేడా తెచ్చినవాడి మీద అరవటము అబ్బో చాలా ఎంజాయ్ చేసాను . ఆకుకూరలు , చుక్క కూర , గోంగూర ఒక్కొక్కటి అరచేతి మందాన వుండి ఫ్రెష్ గా నిగ నిగ లాడిపోతుండేవి . పచ్చివే తినాలనిపించేంత బాగుండేవి . ఏమిటో , అక్కడ ఏది చూసినా తెగ నచ్చేసేది !

వూళ్ళుచూద్దామని అనుకున్నాక అన్ని తెలిసిన డ్రైవర్ కావాలంటే , అక్కడి లోకల్ కాంట్రాక్టర్ ఒకాయన , ట్రావెల్స్ లో పని చేసే జానీ అనే అతనిని పిలిపించారు . బల్లకట్టు మీద కార్ తోసహా , బర్రెలు , మేకలు , సామాన్లతో మనుషుల తో పాటు గోదావరి దాటటము తో మా ప్రయాణము మొదలైంది . గోదావరి పాయల వెంట , గట్ల మీద , కొబ్బరి చెట్ల నడుమ , మధ్య మధ్య లో పాలకోవా తింటూ , చాలా ఆహ్లాదంగా సాగింది .ద్రాక్షారామం , సామర్ల కోట , భీమవరం , పాలకొల్లు , మందపాడు , ర్యాలి , పిఠాపురం, ధవళేశ్వరం అన్ని చూసాము . అంతర్వేది దగ్గర , గోదావరి ,సముద్రం లో కలిసే చోటుకు వెళ్ళాము . అక్కడ యు షేప్ లో వున్న చోట స్నానం చేసి వస్తూ , ఇక్కడ ఎవరూ లేరేమిటి , అంతా దూరంగా ఎక్కడో వున్నారు అనుకున్నాము . ఇంతలోనే ఒక పెద్ద అల మా దాకా వచ్చేసింది . ఆ తరువాత జానీ , మీరు అంత దూరం వెళుతారనుకోలేదు , అది చాలా డేంజర్ పాయింట్ ఎవరూ వెళ్ళరు , మీరు చాలా లక్కి , మీరున్నప్పుడు పోటు రాలేదు అన్నాడు . బాపురే , మాకు తెలీకుండానే సాహసం చేసాము , అక్కడ కొట్టుకు పోతే ఎవరికీ తెలిసేది కూడా కాదు అనుకున్నాము . కార్తీక మాసం కావటము వలన అన్నిశివాలయాలలో అభిషేకాలు చేసి , దీపాలు వెలిగించాము . రాజమండ్రి , గోదావరి ఒడ్డున వున్న ఉమామహేశ్వర ఆలయము లో ఈశ్వరుని 108 కలువ పూలతో పూజించి , రుద్రాభిషేకం చేసాము . ఆత్రేయపురం లో స్వీట్స్ కొన్నాము . బండారులంకలో మా వారు చీరలు కూడా కొనిచ్చారు . క్రిష్టియన్ ఐనా జానీ , అన్ని గుడులూ వాటి విషిస్టత చెప్పుతూ చక్కగా చూపించాడు . మావారి తో పని చేసే విజయ భాస్కర్ ,లాంచీ ఏర్పాటు చేసి , పాపికొండలు తీసుకెళ్ళాడు . లాంచీ లోనే వండటము , డెక్ మీద కూర్చొని తినటము అందాలరాముడు సినిమా గుర్తొచ్చింది . తిరిగి వచ్చేటప్పుడు లాంచీ మీదనుండి దీపాల వెలుగులో గోదావరి బ్రిడ్జ్ చూడటము , లాంతర్లు కట్టుకొని వెళ్ళే నావలను చూడటము మరపురాని అనుభూతి .అన్నవరం లో సత్యనారాయణవ్రతం చేసుకున్నాము . మొత్తం వారం రోజులు , జానీ పుణ్యమా అని కోనసీమ అంతా తిరిగాము .ఇంకా తిరిగే వారిమే కాని , మా డ్రైవర్ నరసిమ్హా గోల భరించలేక , మా వారికి హైద్రాబాద్ లో పని వుండటము చేతా తిరిగి వచ్చేసాము .

పదిహేను రోజుల క్రితం వెళ్ళినప్పుడు , ఈసారి యానాం వెళ్ళాలి అనుకున్నాను . అసలు కోనసీమ చూడలేదుట , అప్పుడే జానీ అన్నాడు . గోదావరి మీద బోట్ హౌస్ లు కొత్తగా పెట్టారట . అవన్నీ చ్హ్డాలనుకున్నాను , కాని వున్న మూడు రోజులలో మావారికి రెండురోజులు పనే సరి పోయింది . ఆ తరువాత తప్పనిసరై హైద్రాబాద్ రావాల్సి వచ్చింది . మధ్యలో ఒక రోజు యానాం వెళ్ళాము . జాని కోసం వెతికాము కాని అతను దొరకలే . హూస్టన్ దగ్గర , సముద్రపు వొడ్డున వున్న పల్లె లాగా యానాం ను వూహించుకున్నాను . కాని చాలా నిరాశ పరిచింది .ఒక్కటి కూడా పాత భవనం కనిపించలేదు . బీచ్ ను ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుస్తున్నారు . లిక్కర్ కోసం అందరూ వస్తారు అన్నారు . అక్కడికి సీ బాక్ వాటర్ వస్తుందిట గోదావరి మాత్రం మహా ఉదృతం గా వుంది . లాంచి లో ఓ అరగంట తిరిగి రావటము బాగుంది .
మళ్ళీ కోనసీమ ప్రయాణం ఎప్పుడో చూడాలి .

Thursday, April 1, 2010

రాజమండ్రి - 1




రాజమండ్రి చాలా పురాతన మైన నగరము . ఇది వేంగీ - చాళుక్యుల పరిపాలన లో వుండేది ." వేంగీ " అంటే కోస్తా ప్రాంతం అని అర్ధం .మొదట్లో దీనిని వేంగీ అనే పిలిచేవారు . కాలక్రమేణా , రాజమహేంద్రవరం గా మార్చారు . ముఖ్యముగా రాజరాజ నరేంద్రుడు సాహిత్యాని కి , లలిత కళలకు చేసిన సేవతో ప్రాముఖ్యత పొందింది .నన్నయ , తిక్కన మహాభారతం ను తెలుగు లోనికి అనువదించినదీ ఇక్కడే !! ఈస్ట్ ఇండియా వారి కాలము లో బ్రిటిషర్స్ దీనిని వర్తకకేంద్రముగా చేసుకున్నారు . అప్పుడే రాజమండ్రి గా మారింది . కాటన్ దొర తెలుగు భాష మీద మక్కువ ఏర్పరుచుకొని , తెలుగు నేర్చుకొని , తెలుగు భాష , సాహిత్య అభివృధికి కృషి చేసాడు . గోదావరి మీద ధవళేశ్వరము మీద ఆనకట్ట కట్టించి , వర్తకాని ని వ్యవసాయాన్ని అభివృధి పరిచాడు . కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు వెలసినదీ ఈ పుణ్య భూమి లోనే . ముస్లిం ప్రభావము ఈ ప్రాంతములో లేనందున , తెలుగు సాంప్రదాయాలు , ఆచారాలూ సంస్కృతీ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి . ప్రస్తుత కాలము లోనూ పర్యాటక ప్రాంతము గా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది .

రాజమండ్రి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలనే వున్నాయి . పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు శివాలయాలలో నాలుగు , సామర్లకోట , భీమవరం , పాలకొల్లు , ద్రాక్షారామం ఇక్కడనే వున్నాయి . ర్యాలి లో జగన్మొహినీ ఆకారములో విష్ణుమూర్తి ని చూడవచ్చు . ముందువైపు , విష్ణు మూర్తిగా , వెనుక వైపు జగన్మోహినిగా విగ్రహము చాలా నైపుణ్యముతో మలిచారు . ఇక్కడ పూజారులు కూడా చాలా శ్రద్ధ గా దీపము వెలుగు లో చూపిస్తూ వివరిస్తారు . వున్న చోటినుండి , వుద్యోగములో బదిలీ కావలానుకుంటే ర్యాలీని దర్షిస్తే అవుతుందిట . కర్కోటకుడు అనే నాగు , ఈశ్వరుని ప్రతిష్టించి కొలిచిన చోటు మందపల్లి . మందపల్లి శనీశ్వరుని దేవాలయము చాలా ప్రషిద్ది పొందినది . అష్టాదశశక్తి పీఠాలలో వకటి , ద్రాక్షారామము లోని మాణిక్యాంబ . పిఠాపురములోని పురంధరేశ్వరి కూడా అష్టాదశశక్తి పీఠము లోని దేవినే . పిఠాపురం లోనే పాదగయ వుంది . ధక్షయజ్ఞము లో ఉధ్భవించిన వీరభద్రీశ్వర స్వామి వెలసిన చోటు పట్టీసం .

నాసిక్ లో పుట్టిన గోదావరి , పాపికొండల నడుమ వయ్యారం గా వంపులు తిరుగుతూ , , కోనసీమను అన్నపూర్ణ గా మారుస్తూ , రాజమండ్రి దగ్గరలోవున్న , అంతర్వేది దగ్గర సముద్రం లో కలుస్తుంది . ఈ కోన సీమ లోని గోదావరి అందం చూడవలసినదే కాని వర్ణించతరము కాదు .

ఇలా ప్రఖ్యాతి చెందిన దేవాలాయాలు రాజమండ్రి చుట్టుపక్కల చాలానే వున్నాయి . దేవాలాయాలే కాక , కోనసీమ అందాలు చూడాలంటే రెండు కళ్ళూ చాలవు .

Wednesday, March 24, 2010

అదిగదిగో భద్రగిరి







మా నాన్నగారి కి ట్రాన్స్ఫర్ డ్యూ వుండటము వలన , మధ్య లో చదువు పాడవుతుందని ,నేను ఏథ్ క్లాస్ చదివేటప్పుడు బూర్గుం పహాడ్ లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో వుండి చదువుకున్నాను . రోజూ ఉదయమే పొలాల మధ్య లోనుండి నడుచు కుంటూ , మధ్య మధ్య లో పెసరకాయలు తుంపి , కాపలాదారునితో చివాట్లు తింటూ వెళ్ళి , గోదావరి లో స్నానం చేసి , అక్కడి నుండే రాముల వారికి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళము . ప్రతి రోజూ సాయంకాలము కూడా , అమ్మ అత్తయ్య , పిల్లలము అందరము గోదావరి వొడ్డుకు షికారుకెళ్ళేవాళ్ళము . తరుచుగా నావలో అవతలి ఒడ్డుకెళ్ళి గుడికి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళము . నా బాల్య స్మృతులలో , ఆ సంవత్సరము అంతా అలా గోదావరి ఒడ్డున ఆడుకోవటము , సీతారాములని దర్షించుకోవటము , మరపురాని మధురమైనవి .

ఆ తరువాత బహుషా 1985 లో అనుకుంటా , మా వారు పని మీద వెళుతుంటే , నేను ,మా పిల్లలు , మా అత్తగారు , మామగారు ఆయన తో పాటు వెళ్ళాము . అప్పటికి గుడి , గుడి పరిసరాలు నేను చిన్నప్పుడు చూసింట్లుగానే వున్నాయి . ఏమీ మార లేదు . గోదావరి స్నానము , గుడి కెళ్ళటము అంతా మా పిల్ల లిద్దరూ బాగా ఎంజాయ్ చేసారు .పర్ణశాల కు కూడా వెళ్ళి వచ్చాము . అక్కడ వున్న నెమలిని ఫొటో తీసుకుంటుంటే దానికి ఫొటోలు అలవాటేమో , దగ్గరికి వచ్చి చక్కగా ఫోజు లిచ్చింది .

రెండు సంవత్సరాల క్రితం నేనూ , మావారు వెళ్ళాము . అప్పటికి చాలా మార్పులు వచ్చాయి . గోదావరి స్నానం చేద్దామంటే అసలు గోదావరి కనపడలేదు . పెద్ద ఆనకట్ట దర్షనం ఇచ్చింది . ఇక సమయము కూడా లేక పోవటము వలన , గుడి లో అర్చన చేయించుకొని , పులిహోర ప్రసాదము తిని వచ్చాము .

లాస్ట్ వీక్ రాజమండ్రి వెళుతూ , భద్రాచలం వెళ్ళాము . ఈ సారి భద్రాచలం లో ఒకరాత్రి నిద్ర చేద్దామనుకొన్నాము . టూరిస్ట్ వారి సితారా హోటల్ లో బస చేసాము . ఉదయమే గోదావరి స్నానం చేసాము .ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాలను తడుపు తోందట . అందుకే గోదావరమ్మకూ , సితారాములకు మధ్య పాపం అడ్డుగోడ కటారు !!! రష్ కూడా లేక పోవటము వలన దర్షనము కూడా తొందరగానే అయ్యింది . అర్చన చేసాము . చాలా సంతృప్తిగా అనిపించింది .
వస్తూ బూరుగుం పహాడ్ లో మా స్కూల్ చూసుకొన్నాను . మధురవాణి అన్నట్లు అక్కడ ఏమీ మార్పు రాలేదు . ప్రహారి గోడ కట్టి , దానిని జూనియర్ కాలేజ్ గా , బాయ్స్ స్కూల్ గా మార్చారు అంతే ! మేము వున్న ఇల్లు కూడా గుర్తు పట్టగలిగాన నే అనుకున్నాను .
ఆపైన అదిగో కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి . కాదు కాదు , ఎండలో తళ తళా మెరిసిపోతూ , రెండు గట్ల నడుమ పారుతూ ఎంత బాగుందో !
ఈ ఫొటొ సితార హోటల్ లో , లాన్ లో వున్న శ్రీరాముడు , శబరిల విగ్రహాలది . పక్కన లక్ష్మణ స్వామి కూడా వున్నారు , కాని నాకే ఆయనను ఫొటో తీయటము రాలేదు . మరి కాస్త దూరం గా వున్నారాయె ఏమిచేద్దును ?





శ్రీరామ కటాక్ష సిద్దిరస్తు .
శ్రీరమనవమి శుభాకాంక్షలు .

Monday, December 28, 2009

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా




నేను మొదటి సారి గా తిరుపతి కి , నా పెళ్ళి తరువాత మావారి తో , మా అత్త గారు , మామగారు తోకలిసి వెళ్ళాను . ఉదయము సుప్రభాత దర్శనానికి వెళ్ళి , తొలిసారిగా , మా వారి తో కలిసి ఆ శ్రీనివాసుని దర్శించాను . . ఆ దర్శనమును నేనెన్నడూ మరువలేను . ఆ రోజులలో ఏమాత్రము రెష్ వు౦డేది కాదు . ఎ౦తో సులభముగా లోపలికి వెళ్ళేవాళ్ళమో! నెట్టి వేయటము కూడ వుండేదికాదు . . ఆ తరువాత దాదాపు ప్రతి రె౦డు సంవత్సరాల కొకసారి వెళుతూనే వున్నాము . మేము ఎక్కువగా సుప్రభాత దర్శనానికే వెళుతాము . నేను అ౦దరిక౦టే ముందుగా తయారు అయ్యి , కాటేజ్ బయిట చిన్నగా వాకి౦గ్ చేస్తాను . సామాన్యముగా తిరుపతి కొ౦డ మీద , ఏకాలము లో నయినా తెల్లవారుజామున మ౦చు కురుస్తూ వు౦టు౦ది . ఆ సమయములో అలా నడవటము నాకు చాలా ఇష్ట౦ . ఒకేసారి నిజరూప దర్సనానికి వెళ్ళాము . అసలు ఆ దర్సనము కలగటము ఎ౦త భాగ్యమో ! అది ప్రతి శుక్రవారము మాత్రమే వు౦టు౦ది . ఆ తరువాత తోమాల సేవ కు , కళ్యాణానికి చాలా సారు లే వెళ్ళాము .


మావారు , తిరుపతి లో వర్క్ చేసేటప్పుడు , బైరాగి పట్టెడ లో , మా పిన్నీ వాళ్ళ ఇ౦టి దగ్గర ఇల్లు రెన్ట్ కు తీసుకున్నారు . అప్పుడు నేను , అక్కడ ఒక నెల రోజులు వున్నాను . అప్పుడు , శ్రీనివాసమ౦గాపురము , నారాయణ వనము , శిలాతోరణము , చూసాము . సరే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా , అలివేలు మ౦గను , కాళహస్తీసుని దర్శి౦చకు౦డారాము . ఇక అక్కడ వున్నప్పుడు , కాణీపాక౦ , క౦చి కూడా వెళ్ళాము . చ౦ద్రగిరి కోట కూడా చూసాను . కాని కొ౦డ మీద శ్రీనివాసుని పాదాలు వున్నాయట , వెళ్ళే౦దుకు కుదర లేదు .కొ౦చము ఎత్తు ఎక్కి వెళ్ళాలి , దారి సరిగా వు౦డదు అన్నారు . దాదాపు ప్రతి రోజూ సాయ౦కాలము , గోవి౦దరాజస్వామి మ౦దిరానికి నడిచి వెళ్ళేదానిని . అక్కడ వున్న ఇత్తడి సామానుల దుకాణమును౦డి ఒక అమ్మవారి మొహము , ఫీఠము తెచ్చుకున్నాను . పైన డాబా మీద కూర్చొని ,సాయం కాలము కాగానే , కొండ మీద వెలుగుతూ వుండే శ్రీనివాసుని నామాలను చూస్తూవుండే దానిని .


తిరుపతి లో తెలుగు రాయలసీమ యాస లో మాట్లాడే వారు . మొదట్లో నాకు అర్ధ౦ అయ్యేది కాదు . కూరగాయలు చాలా తాజాగా వు౦డేవి . వ౦కాయలు నవనవ లాడుతు౦డేవి . కూరగాయలామెను పిలిచి బేరమాడ బోతే , కాలి చ్చేదా అనేది . రాయలసీమ అ౦టే కాళ్ళూ , చేతులూ , పీకలూ నరకటమనే సినిమా నాలెడ్జ్ వున్నదానిని కావటము వలన , నాకాలు తీయాలి కాని , ఆమె కాలిస్తాన౦టు౦దెమిటా ? అని వద్దని ప౦పెసేదానిని . రోజూ ఇదే త౦తు . ఒక రోజు , మా పిన్ని తో , కూరలమ్మాయి కాలిస్తాన౦టు౦దెమిటి ? ఆమె కాలు నాకె౦దుకు ? అని గోల పెట్టాను . మా పిన్ని కి అర్ధ౦ కాలేదు కాని , పక్కనే వున్న మా మరదలు , పకా పకా నవ్వి , కాలివ్వటము కాదు వదినగారు , కాలు అ౦టే పావు కిలో . , పావు కిలో ఇవ్వనా అని అడుగుతో౦ది . అ౦ది . ఓరినీ అనుకున్నాను . పాప౦ ఎ౦త అపార్ధ౦ చేసుకున్నాను !


మేము తిరుపతి లో వు౦డగానే , వైకు౦ఠ ఏకాదశి వచ్చి౦ది . అప్పుడే మావారి కి పని వు౦డటము వలన హైదరాబాదు కు వచ్చారు . నేను మాత్రము ,తిరుపతి లోనే వున్నాను . మా పిన్ని తో కలిసి , వైకు౦ఠఏకాదశికి పై తిరుపతి కి వెళ్ళాను . మనము లోపల , మామూలుగా దర్శనానికి వెళ్ళే ద్వారము పక్కన ఒక చిన్న ద్వారము వు౦టు౦ది . దాని మీద వైకు౦ఠ ద్వారము అని రాసి వు౦టు౦ది . తలుపులు మూసి వు౦టాయి . చాలా సార్లు చూసాను కాని అదేమిటో తెలీ లేదు. ఆ తలుపు వైకు౦ఠఏకాదశి రోజు తెరుస్తారు . ఆ రోజు మనము లోపల కి వెళ్ళవచ్చు. నేను , మా పిన్ని ము౦దు రోజు ననే పై తిరుపతి కి వెళ్ళి , కాటేజ్ లో వున్నాము . మేము తెల్లవారుజామున నే తల స్నాన౦ చేసి , నాలుగు గ౦టలకు వెళ్ళాము . ము౦దుగా వరాహస్వామిని దర్శి౦చుకొని , కోనేటి లో , కాళ్ళు కడుగుకొని , లోపలికి వెళ్ళాము . వైకు౦ఠద్వారము గు౦డా ప్రదక్షణ చేసాము . లోపల అ౦తా దీపతోరణాలు కట్టారు . ఎ౦త ప్రశా౦తముగా వు౦దో చెప్పలేను . చాలా సేపు శ్రేనివాసుని ద్యాని౦చుకు౦టూ అక్కడే కూర్చున్నాము . మరి ఆ రోజు మమ్మలిని ఎవరూ ప౦పి౦చేయలేదు కూడా . వెనుక గోడ దగ్గర నిలబడి , ఆ గోడను ముట్టుకొని , ఇక్కడే కదా శ్రీనివాసుడు వున్నాడు అనుకుంటూ పదే పదే ముట్టుకుంటూ , కళ్ళకద్దుకొని ,వివరించలేని అనుభూతికి లోనైనాను . మరల అలాంటి బాగ్యము కలుగుతుందని అనుకోవటము లేదు . ఆ రోజు అ౦త రెష్ కూడా లేదు . లోపల శ్రీనివాసుని కూడా చాలాసేపే దర్సి౦చుకున్నాము . వైకు౦ఠఏకాదశి రోజు న జరిగిన ఆ దర్శనము నేను జీవితము లో మరచి పోలేనిది , ఆ శ్రీనివాసుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుక . ఏ జన్మ పుణ్య ఫలమో ! నాకు ఆ దర్షన భాగ్యము కలిగించిన మా పిన్ని కి సర్వదా కృతజ్ఞురాలిని .


అప్పుడే తెప్పోత్సవము కూడా చూసే భాగ్యము కలిగి౦ది . హ౦స ఆకారము లో దీపాలతో అల౦కరి౦చిన నావ లో స్వామివారు దేవేరుల తో కలిసి కోనేటి లో విహరిస్తూ౦డగా చూసే౦దుకు రె౦డు కళ్ళూ చాలలేదు . . .


తిరుపతి కొ౦డ మీద సన్నని జల్లులు పడుతు౦డగా , మురమరాలు , మామిడికాయముక్కలు కలిపి చేసిన , చాట్ తినటము ఓ చక్కని అనుభూతి . మా వారి వర్క్ స్పాట్ కి , నేను వెళ్ళినప్పుడల్లా , అక్కడ ఓ అబ్బాయి నా కోస౦ ప్రత్యేకముగా చేసి ఇచ్చేవాడు .


ఇప్పుడైతే ఆ రెష్ లో , క్యూ లో అ౦త సేపు వు౦డి , దర్షనానికి వెళ్ళలేను . అలా అనుకున్నప్పుడల్లా , ఇక్కడే , సత్యసాయి దగ్గర వున్న వె౦కటేశ్వరస్వామి గుడి కో , లేదా , చిక్కడపల్లి వె౦కటేశ్వరస్వామి గుడికో వెళ్ళి వస్తాను . అలా అని అనుకుంటానే కాని వెళుతూనే వుంటాను . ఈ మధ్య నాలుగైదు నెలల క్రితము అనుకుంటాను వెళ్ళాను . ఆ రోజు అందరూ తయారైయ్యే లోపల మనమొకసారి గుడిదాకా వెళ్ళివద్దామని మావారు , నేను వెళ్ళాము . అప్పుడే స్వామి వారి ని మాడలలో ఊరేగింపుకు తీసుకెళుతున్నారు . మేము వెనకాలనే వెళ్ళాము . మమ్మలిని ఆ వూరేగింపు లోకి రమ్మని పిలిచారు .పల్లకీని కొంచము దూరము పట్టుకున్నాము . మేము స్వామివారిని పై చిత్రము లో లా ఊరేగుతున్నప్పుడే కొంచము దూరము మోసింది . మరి ఆ స్వామి అలా కరుణిస్తున్నాడు .

ఆ తరువాత కళ్యాణము రెష్ లో అస్సలు వెళ్ళలేక పోయాను . ఎలాగో కష్టం మీద వెళ్ళాను . ఎప్పటికప్పుడు క్యూ లోనుండి బయటకి వచ్చేస్తానని గొడవ పెడుతునే వుంటాను . మా వారు కోపం చేసి తీసుకెళుతుంటారు !


ఈ రోజు వైకు౦ఠ ఏకాదశి . శ్రీనివాసుని కటాక్ష సిద్దిరస్తు .

Saturday, October 3, 2009

కర్నూలు



1991 లో కర్నూల్ కు మావారు పని మీద వెళుతుంటే నేను ,పిల్లలు కూడా వెళ్ళాము. మల్లాది ఏదో నవల లో కొండా రెడ్డి బురుజు గురంచి చదివినప్పటి నుండి , అది చూడాలని కోరిక వుండింది. మావారు పని లో వుండగా నేను , మా అమ్మాయి , మా అబ్బాయి కర్నూల్ అంతా తిరిగాము. అక్కడ నేను చూద్దామనుకున్న కొండారెడ్డి బురుజు దగ్గర చాలా సమయము గడిపాము. దాని వెనుకననే పోలిస్ స్టేషన్ వున్నట్లు గుర్తు.
ఆ తరువాత తుంగభద్ర దగ్గర సాయిబాబా గుడి లో కొద్దిసేపు వున్నాము.
ఇకపైన చూసేందుకు ఏమీ లేవన్నారు అక్కడి హోటల్ సిబ్బంది. మేమున్న హోటల్ కి దగ్గరలో వున్న సినిమా హాల్ లో వెంకటేశ్ , భానుప్రియ నటంచిన శ్రీనివాస కల్యాణం సినిమా చూసాము.

నిన్నటి నుండి టి . వి లో కర్నూల్ ను చూస్తూవుంటే అప్పుడు మేము చూసిన కర్నూల్ గుర్తుకువచ్చి చాలా బాధ కలుగుతోంది. ఆ రోజు మేము తిరిగిన కొండా రెడ్డి బురుజు కు ,ఈ రోజు పేపర్ లో చూసిన కొండారెడ్డి బురుజుకు తేడ చూస్తూవుంటే మనసు తరుక్కు పోతోంది !
కన్నతల్లి లా అక్కున చేర్చుకునే నదీమతల్లి ఆగ్రహిస్తే పరిస్తితులు ఎంత దారుణముగా వుంటాయోకదా ! ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషి ప్రకృతి ముందు తలదించవలసినదేకదా !

Wednesday, September 9, 2009

శ్రీశైలం



ఆకులో ఆకునై ,
పూవులో పూవునై ,
నునులేత కొమ్మనై ,
ఈ అడవి సాగిపోనా ,
ఎటులైనా ఇచటనే ఆగిపోనా .

శనివారం రాత్రి 9 .30 కి మావారు ఫోన్ చేసి ,రమణ రేపు ఉదయము శ్రీశైలం వెళుదామంటున్నాడు వెళ్దామా ? అని అడిగారు .నేను సరే ఆన్నాను. పొద్దున్నే 7 గంటలకి మా వారు, నేను , మా వారి ఫ్రెండ్ రమణ గారూ , ఆయన భార్య రమ , వారమ్మాయి స్నేహ శ్రీశైలం కి కార్ లో బయిలుదేరాము. పది సంవత్సరాల క్రితం ,మా అబ్బాయి అత్తగారు, మామగారు ,క్రిష్ణవేణి గారు, రమణారావు గార్ల తో మొదటి సారి శ్రీశైలం వెళ్ళాము. ఆ తరువాత మా ఫ్రెండ్స్ తో కలిసి ఓ కార్తీక మాసము లో వెళ్ళాము. ఇది మూడోసారి. శ్రీశైలం ఒక సారి వెళ్ళినవారు మూడు సార్లు తప్పక వెళుతారట !

శ్రీశైలం దగ్గరికి చేరుతుండగా మావారు ,మనము ఎలాగూ 12 గంటల దర్షనానికి చేరుకోలేము ,ఇటువైపు ఉమామహేశ్వర దేవాలయం వుంది వెళుదామా అన్నారు. అది చాలా పురాతన మైన దేవాలయం. కొద్దిగా గుహలోకి వుంటుంది. పార్వతి దేవి ఇక్కడ మహేషునికై తపస్సు చేసిందిట. ఇది శ్రీశైలం కి ఉత్తరద్వారమట. లోపల అమ్మవారి గుడి , పక్కన శివుడి గుడి వున్నాయి.మేము రుద్రాభిషేకం చేయించాము. అమ్మవారి గుడి లో ఒక ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించి పద్మాసనం లో కూర్చోని ధ్యానం చేసుకుంటోంది.మేము అక్కడ కుంకుమ పూజ చేయించేప్పుడు కాని , భక్తులు దర్షనానికి వచ్చినప్పుడు కాని ఆవిడ కళ్ళు తెరచి చూడలేదు. అంత రెష్ లో ,అంత ఏకాగ్రత ఎలా కుదిరిందో అనుకున్నాను.
ఆ దేవాలయము దగ్గరనుండి ఘాట్ రోడ్ మొదలైంది. దారంతా పచ్చనిచెట్లు ,లోయలు , మేకల గుంపులు , కోతుల అల్లరి చాలా ఆహ్లాదం గా వుండింది. ఈ అడవిలోనే వుండిపోవాలనిపించింది ! అన్నట్లు గుడి దగ్గర స్నేహ చేతులోనించి చిప్స్ పాకెట్ గుంజుకు పోయి ,టకటకా ఓ స్తంభం ఎక్కేసీ ఓ కోతమ్మ వాటిని లాగించేసింది. హి హి హి.

దారిలోనే అభయారణ్యం అని పులల బొమ్మలేసి , బోర్డ్ కనిపించింది. లోపలికి తీసుకెళుతారా అంటే ఓయస్ 500 రుపీస్ కట్టండి అన్నారు. మరి పులులు కనిపిస్తాయా అంటే ఆప్ కా కిష్మత్ అన్నాడు సరె ఏం కిష్మత్ తో చూద్దామని వెళ్ళాము. ఎంత కళ్ళు విప్పుకొని చూసినా దూరంగా ఓ నెమలి , ఇంకొంచం దూరం లో ఓనాలుగు జింకలు తప్ప ఏం కనపడలే ! మరే నువ్వొస్తున్నావని అక్కడ ఎదురుగా కూర్చోనివుంటాయ్ అవి అని మావారు జోక్స్. టైగర్ వాలీ మటుకు చాలా మనోహరం గా వుంది. ఎంతసేపైనా కదలాలనిపించలేదు. ఎలాగు పులులు కనిపించలేదు, పాము పుట్ట నైనా ఫొటో తీసుకుందామనుకున్నాను. ఫొటో తీసుకోవాలన్న భయమే 1 స్నేహ మీరు పుట్ట పక్కన నిలబడండి ఆంటీ ఫొటో తీస్తాను అంది.అమ్మో అందులోని పాము ,ముస్తాబై ఫొటో కోసం నా పక్కన వచ్చి ఫొజ్ ఇస్తే ! అప్పుడే గైడ్ చెప్పాడు ,అక్కడ 700 రకాల పాములున్నాయట ! వద్దులేమ్మా అని నేనే దూరం నుంచి ఓ ఫొటో తీసుకున్నాను.

శ్రీశైలం లో పాతాళేశ్వర నిలయం లో రూం తీసుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొని ,సాయంకాలము రోప్ వేలో వెళ్ళాము. అక్కడి నుండి ఓ మోటర్ బోట్ 500 రుపీస్ కి అద్దెకు తీసుకొని కొద్ది సేపు కృష్ణమ్మ లో విహరించాము. మావారికి బుట్ట దొన్నె లో వెళ్ళాలని వుండింది కాని ఇప్పుడు పోనీయటము లేదు అన్నారు.
12 జ్యోతిర్లిగాల లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామికి ,18 శక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబా దేవికి ఆలవాలం శ్రీశైలం .ఇది కర్నూల్ జిల్లా లో ,ఆత్మకూర్ తాలూకాలో వున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణి లో వుంది. ఇది సకల సంపదలతో ,మహర్షుల తపోవనాల తో లతలు అనంతమైన ఓషదుల తో నిండి వున్న చెట్ల తో విరాజిల్లుతుతోంది.
ఇప్పటికీ లోపలి వైపున వున్న చెంచు గూడెముల లోమూలికా వైద్యము చేసే చెంచులు వున్నారట. వారిలో మల్లన్న అనే అతను చాలా వృద్దుడు వున్నాడట. కాని నాగరికులను ఎవరినీ లోపలికి రానివ్వరట. గైడ్ అన్నాడు . నాకు చెంచు గూడెం లో కి వెళ్ళాలని చాలా వుండింది !

మరునాడు తెల్లవారుఝామున 5 గంటల కు రుద్రాభిషేకం , భ్రమరాంబకు కుంకుమ పూజ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. తిరిగి వచ్చేప్పుడు కూడా అదేభావన ,ఆకులో ఆకునై ,పూవులో పూవునై ఈ అడివి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా !
శ్రీశైలా మల్లయ్యా దైవమే నీవయ్యా

Monday, July 20, 2009

పుట్టపర్తి -భగవాన్ అస్ లార్డ్ శివ అండ్ ది గ్రేట్ హీలర్



మా అమ్మాయి అత్తగారు సరళా మాగల్ తండ్రిగారు, శ్రీ.వినాయక్ గోకక్ .ఆయన కన్నడ రచయత ,జ్ఞానపీఠ అవార్డుగ్రహీత. ఈ సంవత్సరము కర్నాటక ప్రభుత్వము ఆయన సెంచనరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నది.. ఆయన సత్యసాయిబాబా యూనివర్సిటీ లో మొదటి వైస్ చాన్సలర్ గా చేసారట. .అప్పుడు వారి కుటుంబానికి బాబా తో సన్నిహిత సంబంధం వుండేదట. అలా సరళ గారు చిన్నప్పటి నుంచే బాబా భక్తురాలు. అనుకోకుండ నేను ఆవిడ తో కలిసి పుట్టపర్తి వెళ్ళటము జరిగింది. మొన్న గురుపూర్ణిమ రోజు ఆవిడ పుట్టపర్తి వెళ్ళి వచ్చానని చెబితే నాకు మా ప్రయాణము గుర్తుకు వచ్చి రాద్దామని పించింది. అప్పుడు సరళ గారిని మీ అనుభవాలు ఏమైనా చెప్పండి నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తాను అని అడిగాను . ఏమిరాయాలి అని అడిగారు. మీఇష్టం అన్నాను. సరె బాబా ఏది ప్రేరేపిస్తే అదే రాసిస్తాను అన్నారు. సరేనని నేను నా అనుభవం రాసి పొస్ట్ చేసాను.మరి ఆవిడా అదే రాసిచ్చారు. మరి ఆవిడన్నట్లు బాబా ప్రేరణ అదేనేమో ! నా మాటలతో చదివారు. ఇప్పుడు అదే ప్రయాణము గురించి ఆవిడ మాటలలలో

Bhagavaan As lord siva and The Great Healer

Sou. Mala and myself were on the A.P.S.R.T.C bus for Puttaparti on Mahasivaratri Night. During darshan Hour ,He came and stood in front of both of us , saying”Bangaroo” .I had done little Namasmarana the previous night ,on the bus. He proved that “if one takes one step forward ,God takes a thousand steps towards you.”

In the afternoon session some one gave Him peppermints on the ladies side. He threw them while He was going to the other side. Both of us got one each.

Next year also we went Puttaparti during the same occasion .I was running fever and had boils in my left part of my head. I had taken no medicine. Both of us were put up at East Prasanthi building.The volunteer there asked to stand in the balcony. Bhagavaan while giving Divine Darshan looked at us. Both of us and another girl, for quite a few moments. Later on my return to Hyderabad my physician late.Dr. Ramaiah of chikkadapalli gave me “ Arnica’ and nothing else. I was cured.

I was told by my mother that Bhagavaan is a Great Healer, specially for women.

Sou.Mala used to stay in Narayanaguda with her family.Her parents-in-laws were devotees of Bhagavaan. They used to go for his darshan at Shivam. When sou. Malas daughter sou. Sanjyoth came back fromUS with her husband(my son) Sateesh,daughter Aditi and son Vikram ,she bought a house in D.D colony ,which is near Sivam .Now sou. Mala’s family ,has bought a house near Sri.Satya Sai Nigamaagamam .

Things do happen after Bhagavaan’s Divine Darshan. Sou. Mala used to go on strict fast on Thursdays in Sri Siridi Saibabaas name. She has been going to Siridi with her husband.

Samasta Loka Shukino Bhavanthu.

Thank you bhabhijii for giving this article