చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, March 24, 2010

అదిగదిగో భద్రగిరి







మా నాన్నగారి కి ట్రాన్స్ఫర్ డ్యూ వుండటము వలన , మధ్య లో చదువు పాడవుతుందని ,నేను ఏథ్ క్లాస్ చదివేటప్పుడు బూర్గుం పహాడ్ లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో వుండి చదువుకున్నాను . రోజూ ఉదయమే పొలాల మధ్య లోనుండి నడుచు కుంటూ , మధ్య మధ్య లో పెసరకాయలు తుంపి , కాపలాదారునితో చివాట్లు తింటూ వెళ్ళి , గోదావరి లో స్నానం చేసి , అక్కడి నుండే రాముల వారికి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళము . ప్రతి రోజూ సాయంకాలము కూడా , అమ్మ అత్తయ్య , పిల్లలము అందరము గోదావరి వొడ్డుకు షికారుకెళ్ళేవాళ్ళము . తరుచుగా నావలో అవతలి ఒడ్డుకెళ్ళి గుడికి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళము . నా బాల్య స్మృతులలో , ఆ సంవత్సరము అంతా అలా గోదావరి ఒడ్డున ఆడుకోవటము , సీతారాములని దర్షించుకోవటము , మరపురాని మధురమైనవి .

ఆ తరువాత బహుషా 1985 లో అనుకుంటా , మా వారు పని మీద వెళుతుంటే , నేను ,మా పిల్లలు , మా అత్తగారు , మామగారు ఆయన తో పాటు వెళ్ళాము . అప్పటికి గుడి , గుడి పరిసరాలు నేను చిన్నప్పుడు చూసింట్లుగానే వున్నాయి . ఏమీ మార లేదు . గోదావరి స్నానము , గుడి కెళ్ళటము అంతా మా పిల్ల లిద్దరూ బాగా ఎంజాయ్ చేసారు .పర్ణశాల కు కూడా వెళ్ళి వచ్చాము . అక్కడ వున్న నెమలిని ఫొటో తీసుకుంటుంటే దానికి ఫొటోలు అలవాటేమో , దగ్గరికి వచ్చి చక్కగా ఫోజు లిచ్చింది .

రెండు సంవత్సరాల క్రితం నేనూ , మావారు వెళ్ళాము . అప్పటికి చాలా మార్పులు వచ్చాయి . గోదావరి స్నానం చేద్దామంటే అసలు గోదావరి కనపడలేదు . పెద్ద ఆనకట్ట దర్షనం ఇచ్చింది . ఇక సమయము కూడా లేక పోవటము వలన , గుడి లో అర్చన చేయించుకొని , పులిహోర ప్రసాదము తిని వచ్చాము .

లాస్ట్ వీక్ రాజమండ్రి వెళుతూ , భద్రాచలం వెళ్ళాము . ఈ సారి భద్రాచలం లో ఒకరాత్రి నిద్ర చేద్దామనుకొన్నాము . టూరిస్ట్ వారి సితారా హోటల్ లో బస చేసాము . ఉదయమే గోదావరి స్నానం చేసాము .ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాలను తడుపు తోందట . అందుకే గోదావరమ్మకూ , సితారాములకు మధ్య పాపం అడ్డుగోడ కటారు !!! రష్ కూడా లేక పోవటము వలన దర్షనము కూడా తొందరగానే అయ్యింది . అర్చన చేసాము . చాలా సంతృప్తిగా అనిపించింది .
వస్తూ బూరుగుం పహాడ్ లో మా స్కూల్ చూసుకొన్నాను . మధురవాణి అన్నట్లు అక్కడ ఏమీ మార్పు రాలేదు . ప్రహారి గోడ కట్టి , దానిని జూనియర్ కాలేజ్ గా , బాయ్స్ స్కూల్ గా మార్చారు అంతే ! మేము వున్న ఇల్లు కూడా గుర్తు పట్టగలిగాన నే అనుకున్నాను .
ఆపైన అదిగో కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి . కాదు కాదు , ఎండలో తళ తళా మెరిసిపోతూ , రెండు గట్ల నడుమ పారుతూ ఎంత బాగుందో !
ఈ ఫొటొ సితార హోటల్ లో , లాన్ లో వున్న శ్రీరాముడు , శబరిల విగ్రహాలది . పక్కన లక్ష్మణ స్వామి కూడా వున్నారు , కాని నాకే ఆయనను ఫొటో తీయటము రాలేదు . మరి కాస్త దూరం గా వున్నారాయె ఏమిచేద్దును ?





శ్రీరామ కటాక్ష సిద్దిరస్తు .
శ్రీరమనవమి శుభాకాంక్షలు .

8 comments:

చిలమకూరు విజయమోహన్ said...

శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు

bhavani said...

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

bhavani said...

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

durgeswara said...

శ్రీరాములదయచేతను....ఇలా చూశాం పర్ణశాల

మధురవాణి said...
This comment has been removed by the author.
మధురవాణి said...

<<< ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాలను తడుపు తోందట . అందుకే గోదావరమ్మకూ , సితారాములకు మధ్య పాపం అడ్డుగోడ కటారు !!! >>>
ఆ కట్టని 'కరకట్ట' అంటారు. ఏం చేస్తారు చెప్పండి మరి!? వానాకాలంలో గోదారి పొంగి పొర్లి భద్రాద్రిని మింగేస్తుందేమో అన్నట్టు భయపెట్టేస్తుంటుంది. అందుకే రక్షణగా ఈ కరకట్ట కట్టారు. అన్నట్టు కరకట్ట మీద పార్కులా చేసి, రామాయణంలోని వివిధ ఘట్టాలు బొమ్మలు పెట్టారు. చూశారా లేదా?
అది కాకుండా, ఈ మధ్యన కొత్తగా 'బాపూ, ముళ్ళపూడి' వారి బొమ్మలలో రామాయణం చిత్రప్రదర్శన పెట్టారు. పాత చిత్రకూట మండపం మూసేసి, కొత్తగా ఇది మొదలెట్టారు. దాదాపు అరవై పైన చిత్రాలు.. ఎంత బాగున్నాయో! తప్పక చూడాల్సిందే!
శ్రీరామనవమి రోజు మా రాముణ్ణి గుర్తు చేసినందుకు, బొమ్మల్లో చూపించినందుకు చాలా చాలా థాంక్స్ మాలా గారూ! :-)

మాలా కుమార్ said...

చిలమకూరు విజయ మొహన్ గారు ,
భవాని గారు ,
దుర్గేశ్వర శర్మగారు ,
ధన్యవాదాలు .

మాలా కుమార్ said...

మధురవాణీ ,
ఆ కరకట్టమీద రామాయణం చూసాను . రక్షణ కోసమే కట్టారు అని తెలిసినా ఎందుకో బాధ అనిపించింది ! కొత్త చిత్రకూటం గురించి తెలీదు . ఈ సారి వెళ్ళినప్పుడు చూస్తాను .