చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, May 13, 2009

సోమనాథ్ ,ద్వారక

డిన్నర్ తరువాత సుధీర్ ధాండేకర్ వెలుతూ క్యారే ప్రభాత్ మీరు కూడా రావచ్చుకదా పిల్లలకి సెలవలెగా అన్నారు.

ఆయన సరే ఎలా వెల్దాము అని అడిగారు.మీరొస్తానంటే మా హెరాల్డ్ లో వెల్దాం అని ప్రోగ్రాం వేసేసారు.అంతే మా సౌరాస్ట్రా ట్రిప్ ప్లాన్ అయిపోయింది.మా ట్రిప్స్ అన్ని అంతే.ముందుగా పలానా చోటుకి,పలానావిధంగా అంటూ ఎప్పుడూ ప్లాన్ చేయము.ఉషా ధాండేకర్ రానంది. మేమిద్దరము,మా పిల్లలు సంజు,బిపు,మా చెల్లెలు జయ పొద్దున్నే బయలుదేరటము ఖాయమైంది.మేమంతా చాలా ఎక్షైటింగా సామానులు సర్ద్దేసాము.పొద్దున ఎనిమిదింటికి సుధీర్ హెరాల్డ్ కార్ తీసుకొని వచ్చేసారు.
మా మొదటి మజిలి అహ్మదాబాద్.షబర్మతి నదీ తీరాన వున్న గాంధిజీ షబర్మతి ఆశ్రమానికి వెళ్ళాము.ప్రశాంతమైన వాతావరణము లో చిన్న చిన్న కుటీరములతో ఎంతో ప్రశాంతముగా వుంది.ఒక కుటేరము గాంధీజీ ది అని,అందులో గాంధీజీ ఉపయోగించిన వస్తువులను ప్రదర్షన కోసము వుంచారు.అక్కడ వున్నంత సేపూ ఒక పవిత్రమైన ప్రదేశం లోవున్న భావన కలిగింది.నాకైతే అక్కడే వుండి పోవాలనిపించింది. భొజనం తరువాత టెక్ష్టైల్స్ మిల్ల్స్ షాప్స్ కి వెళ్ళాము.అహ్మదాబాద్ టెక్ష్టైల్ మిల్ల్స్ కి ప్రసిద్ది.బట్టల చిన్న చిన్న ముక్కలు చాలా చవుకగా అమ్ముతారు.సంజుకు బోలెడు డ్రెస్స్ లు కుట్టవచ్చని సంతోషపడిపోయాను. మవారి ని పట్టించుకోకుండా ఎన్ని పీసెస్ కొన్నానో.రాత్రి ఓపెన్ కార్ థియేటర్ లో సినిమా చూసాము. కార్ లో కూర్చొని భేల్పూరి తింటూ సినిమా చూడటము పిల్లలు ఎంజాయ్ చేసారు.
మరునాడంతా ప్రయాణము చేసి మరునాడు సాయంకాలానికి పోరుబందర్ చేరుకున్నాము.సుధీర్ వాళ్ళ గెస్ట్ హవుజ్ లో బస ఏర్పాటు చేసారు. అక్కడ రెండు రోజులు వున్నాము

సోమనాథ్ దేవాలయము


ఒకరోజు జ్యోతిర్లింగాలలో ఒకటైన సొమనాథ్ దేవాలయాని కి వెళ్ళాము.ఆ రొజు అంతగా రద్దీ లేదు.కార్తీక మాసములో శివదర్షనము కలగటము మా పుణ్యము అనుకున్నాను.అదీ అనుకోకుండా జ్యోతిర్లింగ దర్షనము.అప్పుడే ఒక పక్కగా రిపేరులు చేస్తున్నారు.దేశము లోని అన్ని దేవాలయాల లాగే ఈ దేవాలయమూ ముష్కరుల దాడికి గురైంది.అలాంటివి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది.
అక్కడి నుంచే ద్వారక కి వెళ్ళవచ్చు.బోట్ లో ద్వారక కి బయిలుదేరాము.శ్రీ క్రిష్ణుని రాజధాని ద్వారకకు వెళుతున్నామనగానే యన్.టి.రామారావు గారి శ్రీక్రిష్ణ సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి.మనసంతా ఉద్వేగముతో నిండి పోయింది.ద్వారక దగ్గర పడుతుండగా మా వారు అదిగో ద్వారక ,ఆలమందలవిగో అంటూ పద్యమందుకున్నారు.పిల్లలు క్రిష్నుడి కథలు గుర్తు చేసుకున్నారు.జయ ఎదొ పాట చిన్నగా పాడుకుంటోంది. అందరి భావోద్వేగాల మద్య ద్వారక చేరాము.యాదవుల అంతము తరువాత ద్వారక సముద్రము లో మునిగిపోయింది.ఆ తరువాత ఆ ప్రదేశములో కొద్దిగా బయటకి వచ్చిన ద్వీపము లో కొత్తగా శ్రిక్రిష్ణుని ,సత్యభామ,రుక్మిణి ల భవనములను uఉహించి నమూనాలుగా కట్టారు.దీనిని బేట్ ద్వారక అంటారు.ఎంతో ఊహించుకొని వెళ్ళిన నాకు నిరుత్షాహముగా అనిపించింది.ఇది రుక్మిణి భవనము,ఇది సత్యభామ భవనము అంటూ రకరకాల రంగులు వేసిన చిన్న చిన్న ఇళ్ళు చూస్తే ద్వారక చూసిన అనుభూతి కలుగలేదు. అవే భవనాలు కొద్దిగా నైనా పురాతనముగా వుండేటట్టుగా కడితే బాగుండేది అనిపించింది.ఒకవైపు శ్రీక్రిష్ణుడు సంచరించి న పుణ్య ప్రదేశానికి వచ్చిన తృప్తి ,ఇంకోవైపు ఊహించినట్లుగా లేదన్న నిరుత్షాహము కలిగింది.

అక్కడ తిరగటానికి సుధీర్ అక్కడి ప్రదేశాలు తెలిసిన డ్రైవర్ తొ ఒక జీప్ అరేంజ్ చేసారు.అది ముందు డ్రైవర్ సీట్ పొడుగ్గా ,వెనకాల ఒక పొడుగు సీట్ ఆ వెనుక అడ్డముగా రెండుపక్కల రెండు సీట్ల తో విశాలంగా వుంది.మేము ద్వారక నుంచి వచ్చేసరికి డ్రైవర్ సముద్రము వడ్డున ఎదురుచూస్తున్నాడు.అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది.అందరము అలసిపోయాము.డ్రైవర్ తో ముందువైపు మా వారు సంజు ,వెనుక నేను ,జయ,బిపు కూర్చున్నాము.డ్రైవర్ అక్కడి విషయాలు ఎవో చెబుతున్నాడు.నేను ,జయ ఎదొ మాట్లాడుకుంటున్నాము.ఇంతలో డ్రైవర్ జీప్ ని మేన్ రొడ్ మీదనుంచి పక్కకి తిప్పాడు. ఇప్పుడు ఇటెక్కడికి రేపు పోదాము పిల్లలు నిద్రకు వచ్చారు అని మావారి అందామని ముందుకు వంగాను. ఇంతలో నాభుజం మీద చేయి పడింది.ఎవరా అని వెనక కి చూసాను. ఒక అమ్మాయి బహుషా పదహారు ,పదిహేడు వయసు వుండవచ్చు,నా వెనుక సీట్లో కూర్చొని వుంది.నేను చూడగానే నవ్వింది.వెన్నెల వెలుగు లో ఎర్ర చీరా ,పసుపు జాకిట్టు వేసుకొని గుజరాతి రకముగా తల పైన కొంగు ముసుగు వేసుకొని,గుడ్రటి మొహము తో మెరిసి పోతూ కనిపించింది.మేము జీప్ ఎక్కిన్నప్పుడు లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అర్ధము కాలేదు. మావారి అడుగుదామంటే నోట మాట రావటములేదు. వెనకకి ముందుకి చూస్తున్నాను.జీప్ ఒక చెరువు పక్కనుంచి చిన్న కొండ ఎక్కింది.అక్క్డద చెరువులో కొంతమంది ఆడవారు దీపాలు వదులుతున్నారు.చెరువు దాటగానే చిన్న గుడి దాని ముందు కొన్ని షాపులు కనిపించాయి. అక్కడ జీపు ని ఆపి మమ్మలిని దిగమన్నారు.వెనకకి చూద్దును కదా ఆ అమ్మయి లేదు.డ్రైవర్ ,మా వారు ఎమి మాట్లాడు తున్నారో వినటము లేదు.ఆయన వెనుకనే గుడి లోకి వెళ్ళాను.అక్కడ అమ్మవారి విగ్రహము చూడగానే అరె ఈ అమ్మాయి ఇప్పుడు మనతో వచ్చిందికదా అని నాకు తెలికుండానే గట్టిగా అరిచాను. మావారు జయ బిత్తర పోయారు.పుజారి ఎమిటి అని అడ్గ్గానే నేను జీపు లో చూసిన అమ్మాయి గురించి చెప్పాను.అప్పుడు ఆయన చెప్పింది ఇది: ఈ గుడి హరిసిద్దిమాతా ది.ఈ గుడి కింద నుంచి ఉజ్జయిని లోని హరిసిద్ది మాత గుడి కింది కి సొరంగ మార్గము వుంది.ఉజ్జయిని రాజు శత్రువుల నుంచి తప్పించుకొని ఆ దారి గుండా ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాడు.ఆయన శత్రువులను జయించి తిరిగి పాలనలో కి వచ్చిన్నప్పుడు ఈ గుడి కట్టించాడు.ప్రతి కార్తీక పౌర్ణమి కి అమ్మవారు ఉజ్జయిని నుంచి ఇక్కడి కి వస్తుంది అని నమ్మకము.అలాగే ఆరొజు ఎవరోవకరి కి దర్షనము ఇస్తుంది.ఈ రొజు కార్తీక పౌర్ణమి మీకు దర్షనము ఇచ్చింది అని చెప్పారు.ఇది నమ్మలేని నిజం.అసలు హరిసిద్దిమాత పేరె నేను ఎప్పుడూ విన్లేదు.అప్పుడు ఆ గుడి కి వస్తున్నట్లు కూడా తెలీదు.చివరి నిమిషములో డ్రైవర్ జీప్ అటు తిప్పాడు.ఇప్పటి కీ గుర్తుకు వస్తే వళ్ళు గగుర్లు పొడుస్తుంది

అమ్మవారి ని మనసారా పూజించుకొని తిరిగి వెళుతుండగా డ్రైవర్ ,అశ్వథామ ఈ పరిసరాలలో తిరుగుతూవుంటాడు.అప్పుడప్పుడు కొంతమంది చూసామని చెబుతుంటారు అన్నాడు.గది కి చేరాకా ,పిల్లలని నిడ్రపుచ్చి నేను ,జయ బాల్కనీ లో అశ్వధామ కనిపిస్తాడేమొ చూద్దామనుకుంటూ కూర్చొని హరిసిద్దిమాత గురించి చెప్పుకునంటున్నాము.అశ్వధామ అయితే కనిపించలేదు కాని ,ఒక అపూర్వమైన ద్రుశ్యము కనిపించింది.కార్తీక పున్నమి సంధర్భముగా చాలా మంది ష్త్రీలు సముద్రము వడ్డున నిలబడి పాటలు పాడుతూ సముద్రములో దీపాలు వదులుతున్నారు.మా అథిధి గృహం సముద్రము వడ్డుకు దగ్గరలో వుండటము మూలముగా మాకు చూసే భాగ్యము కలిగింది.కొద్దిసేపు తరువాత అంతా వెళ్ళిపోయారు.ఆ నిశబ్ద ,వెన్నెల రాత్రి అలల పై తేలి పోతున్న దీపాలు ,ఒహ్ వర్ణిచటము నా తరము కాదు.

చల్తే చల్తే మేరి ఏ బాత్ యాద్ రఖనాఖభీ అల్విదా నా కహనా

4 comments:

Sridevi Aduri said...

మంచి ఆర్టికలు . . మరిన్ని యాత్రా విశేషాల కోసం ఎదురు చూస్తాను ...
మీ శ్రీ

మాలా కుమార్ said...

thank you sri

మరువం ఉష said...

అటువంటి దర్శనం అదీ కారణం అంతుబట్టనిది నాకూ జరిగింది. నాకు 18సం. వయసపుడు అమ్మమ్మ గారింటికి వెళ్ళి అక్కడే జ్వరపడి బాగా నలత పడినపుడు.అమ్మమ్మ ముత్యాలమ్మకి మొక్కుకున్నారట. నాకు తగ్గాక మొక్కు తీర్చుకుని మా అమ్మగారితో కలిసి మావూరికి బయల్దేరి వెళ్ళేప్పుడు, మా వూరి వంతెన మీద ఎర్ర చీరలో పండు ముత్తైదువ ఒకరు నన్ను పలుకరించినట్లు, నేనేదో అన్నట్లు భావన. అవునూ, ఆవిడ అమ్మతో మాట్లాడరే అనుకునేలోపు చేయెత్తి అభయమిస్తున్నట్లు నవ్వి ఆవిడ అక్కడే ఆగిపోయారు. తేరుకుని అమ్మకి చెప్పేలోపు అదృశ్యమయ్యారు. ఇది నాకు ఇప్పటికీ నమ్మలేని నిజం. నిజానికి ఆ సమయంలో ఆలాపనలో కూడా నేను ముత్యాలమ్మని తలవలేదు. గ్రామదేవత అలా కనపడటం జరుగుతుందని తర్వాత విన్నాను. ఇప్పుడు సహజమార్గ ధ్యాన సాధనలో వున్నాను కనుక ఆధ్యాత్మికంగా పయనిస్తున్నా ఈ పయనానికి ఒకప్పటి భక్తి విశ్వాసాలు, విగ్రహ రూపంగా దేముని పూజించటం పునాదులు.

మాలా కుమార్ said...

ఉష గారు,
థాంక్స్ అండి.
ఇలాంటివి నమ్మలేని నిజాలే.ఎవరికి వారే పొందే అపూర్వ సంఘటనలు.వర్ణించలేము.