చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Sunday, January 16, 2011

6వ శతాబ్ధము నాటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానము




















హైదరాబాద్ నుంచి , బి హెచ్ యల్ తరువాత , దగ్గర దగ్గర 8 కిలోమీటర్లు దాటిన తరువాత , కుడి వైపు " బీరంగూడ " అని చిన్న వూరు వస్తుంది . మేన్ రోడ్ కు కుడివైపు పెద్ద కమాన్ , " భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానము ' అని రాసిన ది కనిపిస్తుంది . కమాన్ నుండి లోపలికి వెళ్ళి , జంక్షన్ లో ఎడమవైపుకు తిరిగి కొద్ది దూరం వెళ్ళితే అంతా చిన్న చిన్న కొండలతో వున్న ఖాళీ మైదానములో వున్నది 6 లేక 7 శతాబ్ధము లో నిర్మించబడినట్లుగా చెప్పబడుతున్న , మల్లికార్జున స్వామి దేవాలయము .

భోగ మహర్షి , బృగు మహర్షి ప్రదేశములో తపస్సు చేసుకున్నారట. అక్కడే గుహ కింద నుండి శ్రీశైలం కు సొరంగ మారగము కూడా వుండేదట . మహర్షులు ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళేవారని , స్వామి నే ఇక్కడా ప్రతిష్టించారని , అందుకే ఇక్కడ శివుని కూడా మల్లికార్జున స్వామి
అంటారట .

బాదామి చాళుక్యుల కాలం లో ఇక్కడ దేవాలయము కట్టించారని , రాష్ట్రకూటులు , కళ్యాణి చాణుక్యులు , కాకతీయులు మల్లికార్జునిని సేవించుకున్నారని చరిత్ర. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత , నవాబుల కాలం లో కొంత వైభవం తగ్గిందట . మొగలుల దాడులలో దేవాలయము కూలిపోయిందట.

సికింద్రాబాద్ మిలిట్రీ లో పని చేసే తిప్పర వెంకయ్య అనే అతను , సన్యసించటానికి వివేకానదుని వద్దకు వెళ్ళగా , వివేకానందుడు ముందు గృహస్తధర్మం నిర్వహించి రమ్మని తిప్పి పంపారట . వెంకయ్య తిరుగు ప్రయాణములో ఇక్కడ విశ్రమించిన సమయములో స్వామి కలలో కనిపించారట . అక్కడే దగ్గర వున్న నూతిలో శివలింగం దొరికిందట . దాని తో స్నేహితుల సహాయముతో చిన్న గుడి కట్టించాడట .

1898 లో గంగా రెడ్డి అనే భక్తుడు శిలా మండపం కట్టించాడు . ఆంజనేయస్వామిని కూడా ప్రతిష్ఠించారు . వెంకయ్య తరువాత ఆయన కుమారుడు
భార్గవ దేవాలయ భాద్యతను తీసుకున్నారు .వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి . అన్నపూర్ణ , ఆవిడ కుమారుని తో కలిసి ఇప్పుడు వున్న విధముగా నిర్మించారు . అంతే కాకుండా పక్కనే వెంకటేశ్వరాలయము కూడా నిర్మించారు .

భ్రమరాంబా మల్లికార్జున ఆలయము లో వున్న ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద శనీశ్వరుడు వుండటము ఇక్కడి ఇంకో ప్రత్యేకత .
ఆలయము వున్న ప్రదేశము చాలా ప్రశాంతము గా వుంటుంది . ఎంతసేపు వున్నా తనివి తీరలేదు


ఆలయము నుంచి మేన్ రోడ్ మీదకు వచ్చాక ముందుకు ఇంకో 16 కిలోమీటర్ లు వెళి, కుడి వైపు మట్టి రోడ్ వెంట లోపలికి ఇంకో రెండు కిలోమీటర్లు వెళితే ఇస్మాయిల్ ఖాన్ పేట్ అనే గ్రామము వస్తుంది . అక్కడ సప్తప్ర్రాకారాయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్రం వుంది . పెద్ద కోట లాంటి ప్రహారి లో దేవాలయము వుంది . ప్రాహారీ నిర్మించేటప్పుడు , అక్కడ కూలి గా చేస్తున్న సోదరుని కోసం భవానీ అనే అమ్మాయి భోజనం తేగా , కొందరు తుంటరి కూలీలు అమ్మాయిని ఏడిపించారట . దానితో ఆమె కలత చెంది ప్రాకారములో మూలకు వెళ్ళి శిలగా మారి పోయిందట .

ఎనిమిది సంవత్సరాల క్రితం శ్రీ మదానంద స్వామి , ప్రదేశము లో నిదురించగా అమ్మవారు స్వప్నము లో అగుపించి దేవాలయమును నిర్మించమని ఆదేశించిందట . వెను వెంటనే నిధులు కూడా సమకూరాయట . చక్కని దేవాలయమును నిర్మించారు . దుర్గాభవాని విగ్రహము నిలువెత్తు లో వుండి , చాలా కళగా వుంది .

మేన్
రోడ్ మీదకు రాగానే ఎడమవైపు , 300 సంవత్సరాల పురాతనమైన , రుద్రారం సిద్ది గణపతి ఆలయము వుంది . దాని గురించి రేపు చెపుతాను .

మొన్న 12 తారీకున , పుష్య శుద్ద అష్టమి బుధవారము రోజున పూజ చేస్తే లక్ష సార్లు ఫలితమిస్తుందట . రోజున అనుకోకుండా , నేను
మా అమ్మ , లక్ష్మి గారు దేవాలయాలను దర్శించుకున్నాము .

No comments: